Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు గాయని కనికకు కరోనా ఉపశమనం

By:  Tupaki Desk   |   5 April 2020 11:23 AM IST
ఎట్టకేలకు గాయని కనికకు కరోనా ఉపశమనం
X
ప్రముఖ బాలీవుడ్ గాయనీ కనికా కపూర్ కరోనా నుంచి ఉపశమనం పొందారు. లండన్ నుంచి మార్చి 9న వచ్చిన కనికకు కరోనా లక్షణాలు కనిపించడంతో ఆస్పత్రిలో చేరింది. అప్పటికే ఆమె పలువురు సెలెబ్రెటీలు, రాజకీయ ప్రముఖులను కలిసింది. క్వారంటైన్ కు తరలించగా బయటకు వచ్చి హల్ చల్ చేసింది. దీంతో పోలీసులు కేసు కూడా పెట్టారు.

ప్రస్తుతం కనికా ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఉన్న సంజయ్ గాంధీ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతోంది. చికిత్సలో భాగంగా ఆమెకి నాలుగు సార్లు టెస్ట్ చేశారు. అన్ని సార్లు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది.

తాజాగా ఐదోసారి కరోనా టెస్టు చేశారు. ఈసారి ఆమెకు నెగెటివ్ వచ్చింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం కనిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

అయితే ఇప్పటికిప్పుడు కనికను వైద్యులు ఇంటికి పంపడం లేదు. 8 రోజుల పాటు టెస్టులు చేశాక.. పూర్తిగా నెగెటివ్ వస్తేనే విడుదల చేస్తామన్నారు. అప్పటికి కానీ కనికా కరోనాపై పూర్తిగా విజయం సాధించినట్టు కాదు..