Begin typing your search above and press return to search.

కరోనా నేపథ్యంలో కనిక ఎమోషనల్‌ లెటర్‌

By:  Tupaki Desk   |   30 March 2020 3:00 PM GMT
కరోనా నేపథ్యంలో కనిక ఎమోషనల్‌ లెటర్‌
X
బాలీవుడ్‌ సింగర్‌ కనిక కపూర్‌ కరోనా పాజిటివ్‌ అని తేలడం తో ప్రస్తుతం ఆమెను సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ మెడికల్‌ ఇన్సిట్యూట్‌ లో ఉంచి చికిత్స అందిస్తున్న విషయం తెల్సిందే. ఆమె ట్రీట్‌ మెంట్‌ కు స్పందించడం లేదని నాలుగు సార్లు కరోనా వైరస్‌ టెస్టు చేసినా కూడా ఇంకా పాజిటివ్‌ గానే వచ్చిందని.. మరో వారం తర్వాత అయినా ఆమె కరోనా నెగిటివ్ గా మారుతుందేమో చూడాంటూ ఆమె హెల్త్‌ బులిటెన్‌ ను వైధ్యులు విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాలకు తీసుకు వెళ్లి చికిత్స చేయించే వీలు కూడా లేకపోవడం తో వారి ఆందోళన మరింత పెరుగుతోంది. ఈసమయంలోనే కనిక కపూర్‌ సోషల్‌ మీడియా ద్వారా ఒక లెటర్‌ ను విడుదల చేయడం జరిగింది. ఆ లెటర్‌ లో కనిక కాస్త ఎమోషనల్‌ అయ్యింది. ఆమె తన కుటుంబ సభ్యుల పట్ల ఆందోళనతో ఉన్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఆ లెటర్‌ లో కనిక.. ప్రస్తుతం తాను ఐసీయూలో లేను. కాని నా కుటుంబ సభ్యులను ఎప్పుడెప్పుడు కలుస్తానా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. వారిపై బెంగగా ఉంది. సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలని ఇది జీవిత పాఠాన్ని నేర్పింది. సమయం జీవితం యొక్క గొప్పదనంను నేర్పుతుంది. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ కనిక పోస్ట్‌ చేసింది.

లండన్‌ వెళ్లి వచ్చిన కనిక కు కరోనా పాజిటివ్‌ నమోదు అయిన విషయం తెల్సిందే. ఆమె పాజిటివ్‌ అని నిర్థారణ కాకముందు పలువురు రాజకీయ ఇంకా సినీ ప్రముఖులను కలిసింది. ప్రస్తుతం వారంతా కూడా క్వారంటైన్‌ లో ఉన్నారు. ప్రస్తుతానికి వారందరికి కూడా నెగటివ్‌ వచ్చినట్లుగా వైధ్యులు చెబుతున్నారు.