Begin typing your search above and press return to search.

కంగనాకు ఎక్కువ కంఫర్ట్‌ అక్కడేనట!

By:  Tupaki Desk   |   6 Oct 2020 12:30 AM GMT
కంగనాకు ఎక్కువ కంఫర్ట్‌ అక్కడేనట!
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌.. ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ప్రస్తుతం 'తలైవి' సినిమా షూటింగ్‌ కోసం దక్షిణ భారతంలో ఉన్నట్లుగా గతంలోనే పేర్కొంది. హైదరాబాద్‌ లో ఆమె తలైవి షూటింగ్‌ లో పాల్గొంటున్నట్లుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో కంగనా రనౌత్‌ ప్రతి రోజు షూటింగ్‌ అప్‌ డేట్‌ ఇస్తూ వస్తోంది. తలైవి సినిమా షూటింగ్‌ కోసం దాదాపు ఏడు నెలల తర్వాత కెమెరా ముందుకు వచ్చినట్లుగా ఇటీవలే పేర్కొన్న కంగనా తాజాగా ఆన్‌ లొకేషన్‌ స్టిల్స్‌ ను విడుదల చేసిన కంగనా మరో సారి ట్విట్టర్‌ లో సందడి చేసింది. ఈసారి జయలలిత లుక్‌ లో ఉన్న ఫొటోలను ట్వీట్‌ చేయడంతో ఆమె ట్వీట్‌ వైరల్‌ అయ్యింది.

ఫొటోలతో పాటు ఆమె ట్విట్టర్‌ లో... గుడ్‌ మార్నింగ్‌ ఫ్రెండ్స్‌.. ఇవి నిన్న ఉదయం షూటింగ్‌ కు సంబంధించిన పొటోలు. ప్రతిభవంతుడైన దర్శకుడు ఏ ఎల్‌ విజయ్‌ తో చర్చలు జరుపుతుండగా తీసిన ఫొటోలు అంది. ఈ ప్రపంచంలో చాలా అమెజింగ్‌ ప్లేస్‌ లు ఉన్నాయి. కాని నాకు మాత్రం షూటింగ్‌ సెట్‌ అత్యంత కంఫర్ట్‌ ను ఇస్తుందని కంగనా ట్వీట్‌ చేసింది.

సుశాంత్‌ కేసు విషయంలో కంగనా వ్యాఖ్యలు ఆ తర్వాత డ్రగ్స్‌ కేసులో వ్యాఖ్యల కారణంగా ఆమెకు సోషల్‌ మీడియాలో విపరీతమైన మద్దతు లభించంది. ఇదే సమయంలో ఆమెకు మహారాష్ట్ర ప్రభుత్వం నుండి బెదిరింపులు మరియు శివసేన కార్యకర్తల నుండి హెచ్చరికలు వచ్చాయి. అయినా వాటికి భయపడకుండా తాను అనుకున్నది అన్నుకున్నట్లుగా ఆమె చేసుకుంటూ వెళ్తుంది. అందుకే ఆమెను అంతా కూడా డేరింగ్‌ హీరోయిన్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాయి.