Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ లో బాలీవుడ్ టాప్ హీరోలు దొరికిపోవ‌డం ఖాయం

By:  Tupaki Desk   |   26 Aug 2020 5:33 PM GMT
డ్ర‌గ్స్ లో బాలీవుడ్ టాప్ హీరోలు దొరికిపోవ‌డం ఖాయం
X
బాలీవుడ్ మాఫియాని.. ఏ లిస్ట‌ర్ల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఆడుకుంటోంది క్వీన్ కంగ‌న‌. బ‌య‌టి నుంచి వ‌చ్చే ప్ర‌తిభ‌ను బాలీవుడ్ మాఫియా తొక్కేసేందుకు ఎలాంటి కుట్ర‌ల‌కైనా తెగిస్తుంద‌ని ఇలాంటి వాళ్ల‌ను ఏరి పారేయాల‌ని తీవ్రంగా విరుచుకుప‌డుతోంది. సుశాంత్ మరణానికి మహేష్ భట్- ఆదిత్య చోప్రా- కరణ్ జోహర్ లాంటి వారు కార‌ణం అంటూ కంగ‌న‌ విరుచుకుపడుతోంది. సుశాంత్ కేసులో వారిని విచారించాలని కంగ‌న సీబీఐని కోరుతోంది.

అంతేకాదు.. బాలీవుడ్ లో మురికిని క‌డిగేయాలి! అంటూ నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనే కోరింది కంగ‌న‌.ఈ రోజు ఆమె ఒక అడుగు ముందుకు వేసి స్వచ్ భారత్ మిషన్ ని ఉపయోగించుకుని బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉన్న గందరగోళాన్ని శుభ్రపరచాలని మోడీని అభ్యర్థించారు.

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో బాలీవుడ్ ‌లోకి ప్రవేశిస్తే.. చాలా మంది ఎ-లిస్టర్లు జైల్లో ఊచ‌లు లెక్కిస్తార‌ని వారికి రక్త పరీక్షలు జరిగితే చాలా షాకింగ్ విష‌యాలు తెలుస్తాయ‌ని కంగ‌న చెప్పారు. ఒక ర‌కంగా బాలీవుడ్ ఏ లిస్ట‌ర్ల‌పై ఫిరంగిలా విరుచుకుప‌డింది. ప్ర‌స్తుతం సుశాంత్ సింగ్ కేసులో రియా చ‌క్ర‌వ‌ర్తికి డ్ర‌గ్ స్కాంతో ఉన్న సంబంధాల‌పై సీబీఐ ఆరాలు తీస్తోంది. ఇందులో రియా.. ఆమె సోద‌రుడు కూడా ప‌ట్టుబ‌డ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

నార్కోటిక్స్ లో చాలా మంది టాప్ హీరోలు.. హీరోయిన్లు జైలు ఊచలు లెక్కించాల్సి ఉంటుంద‌న్న‌ది కంగ‌న నివేద‌న‌. బాలీవుడ్ మురికి కంపును ప్రధాని క్లీన్ చేయాలని కంగ‌న కోరింది. సుశాంత్ కేసులో డ్రగ్ మాఫియా హస్తం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేసేందుకు నార్కోటిక్స్ వాళ్లు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు ఏ లిస్ట‌ర్లకు స‌మ‌న్లు పంపారు.