Begin typing your search above and press return to search.

కంగనా కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నా : లెజెండ్రీ సినిమాటోగ్రాఫర్‌

By:  Tupaki Desk   |   9 Sep 2020 4:46 AM GMT
కంగనా కారణంగా ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నా : లెజెండ్రీ సినిమాటోగ్రాఫర్‌
X
'గీతాంజలి' 'ఖుషి' 'ఇష్క్' 'రంగ్ దే' వంటి తెలుగు చిత్రాలకు వర్క్ చేసిన లెజెండ్రీ సినిమాటోగ్రాఫర్‌ పి.సి. శ్రీరామ్‌.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కారణంగా ఓ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పి.సి. శ్రీరామ్‌ ట్వీట్ చేస్తూ ''కంగనా రనౌత్ లీడ్‌ రోల్‌ లో నటిస్తున్న కారణంగా ఒక సినిమాను తిరస్కరించాల్సి వచ్చింది. నేను అసౌకర్యంగా భావించి ఈ విషయాన్ని చిత్రబృందానికి చెబితే వాళ్లు అర్థం చేసుకున్నారు. కొన్నిసార్లు మన మనసుకు ఏది మంచిదనిపిస్తే అది చేయాలి. ఈ చిత్ర యూనిట్ కి ఆల్‌ ది బెస్ట్‌'' అని ట్వీట్ చేశారు.

పి.సి. శ్రీరామ్‌ ట్వీట్ కి కంగనా రనౌత్ కూడా రిప్లై ఇచ్చింది. ''మీలాంటి లెజెండ్‌ తో పని చేసే అవకాశాన్ని మిస్సయ్యాను. ఇది నిజంగా నాకు నష్టమే. మీకు ఇబ్బంది కలిగిన అంశమేంటో నాకు తెలియడం లేదు. ఏది ఏమైనా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరిగానే ఉంటుందని భావిస్తున్నాను. విష్‌ యూ ఆల్‌ ది బెస్ట్‌'' అని కంగనా రనౌత్‌ ట్వీట్ చేసింది. దీనికి పి.సి. శ్రీరామ్‌ 'మచ్ అప్రిసియేటెడ్' అని రిప్లై ఇచ్చారు.

కాగా, కంగనాతో పీసీ శ్రీరామ్‌ కు ఎలాంటి వివాదం లేకపోయినప్పటికీ ఇటీవల ఆమె వ్యవహారశైలి నచ్చకే ఆయన ఆ ప్రాజెక్ట్నుంచి తప్పుకున్నారని అందరూ అనుకుంటున్నారు. కంగనా రనౌత్ ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే కంగనా బాలీవుడ్‌ లో నెలకొన్న నెపోటిజమ్‌ గురించి కామెంట్స్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో హీరో సుశాంత్ సింగ్ మృతి కేసుపై అనేక అనుమానాలు లేవదీస్తూ బాలీవుడ్ ప్రముఖులపై ఆరోపణలు చేసింది. ఇక ఈ డ్రగ్స్ వ్యవహారంపై మాట్లాడి బాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ డ్రగ్స్ ని నీళ్ళలా తీసుకుంటారని కామెంట్స్ చేసింది. ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చి వివాదం రేపిన సంగతి తెలిసిందే.