Begin typing your search above and press return to search.

'ఇషా ఆశ్రమాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   11 April 2021 1:30 AM GMT
ఇషా ఆశ్రమాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్..!
X
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్.. తన రాబోయే చిత్రం తేజస్ మూవీ రాజస్థాన్ షెడ్యూల్ ఇటీవలే ముగించింది. తాజాగా అమ్మడు ట్విట్టర్‌లో ఇషా ఫౌండేషన్ ఆశ్రమాన్ని సందర్శించిన అనుభవాన్ని షేర్ చేసుకుంది. ఇషా ఫౌండేషన్ 1992లో సద్గురుచే స్థాపించబడిన ఒక ఆధ్యాత్మిక సంస్థ అని అందరికి తెలిసిందే. అక్కడి ఫోటోలను షేర్ చేస్తూ ప్రకృతిలో ఆశ్రమంలో అద్భుతమైన ఆధ్యాత్మిక వాతావరణం మధ్య గడిపిన ఆనంద క్షణాలను కంగనా షేర్ చేసింది. అలాగే తమిళ ఫుడ్, ఫిల్టర్ కాఫీ ఫోటోలు కూడా పోస్ట్ చేసింది. కంగనా ఆశ్రమంలో 'యోగా, ధ్యానాలు' చేయడం ఆనందంగా ఉందని పేర్కొంది. ఆ నిర్మలమైన వాతావరణంలో పక్షులు ఉదయాన్నే మేల్కొల్పుతాయి.

కంగనా తన ఆధ్యాత్మికత భావన గురించి మాట్లాడటం మొదటిసారి కాదు. తమిళనాడు కోయంబత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఆనందం వ్యక్తం చేసింది. గతంలో మణికర్ణిక విడుదలకు ముందే కంగనా ఆ ఇషా ఫౌండేషన్ సందర్శించింది. అక్కడి క్యాంపస్ చుట్టూ పర్యటించింది. ఫోటోలు చూస్తే కంగనా ఆధ్యాత్మిక భావన ప్రతిబింబిస్తూ.. కుటుంబం, వృత్తి అలాగే లైఫ్ కి సంబంధించి ఆశీర్వాదం కోరుతూ ప్రార్ధన చేయడం మనం చూడవచ్చు. ప్రస్తుతం కంగనా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. కంగనా ప్రస్తుతం దాకడ్, తేజాస్ సినిమాలతో పాటు ఇటీవలే తలైవి సినిమాలో నటించింది. ఆ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది.