Begin typing your search above and press return to search.

దిగ్గజ నటుల మరణాలపై వివాదాస్పద ట్వీట్ చేసిన బాలీవుడ్ యాక్టర్...!

By:  Tupaki Desk   |   30 April 2020 4:30 PM GMT
దిగ్గజ నటుల మరణాలపై వివాదాస్పద ట్వీట్ చేసిన బాలీవుడ్ యాక్టర్...!
X
బాలీవుడ్ లో అత్యంత వివాదాస్పద నటుడిగా కమల్ ఆర్ ఖాన్ కి గొప్ప పేరే వుంది. ఇండస్ట్రీ ప్రముఖుల మీదా.. సినిమాలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎప్పడూ వార్తలలో ఉంటాడు ఈ నటుడు. ముఖ్యంగా మన సౌత్ ఇండియా యాక్టర్స్ పై.. సినిమాలపై ఎక్కువగా బ్యాడ్ కామెంట్స్ చేస్తూ మనవారి ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. ఒక తరుణంలో ఇతని చర్యలు శృతిమించి పోవడంతో తన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా డిలీట్ చేశారు. ఇప్పుడు లేటెస్టుగా ఈ నోటిదూల కమల్ ఆర్ ఖాన్ మరోసారి నోటి దురుసును బయటపెట్టుకొన్నాడు. ఒక్కరోజు వ్యవధిలో ఇద్దరు లెజెండరీ నటులు ఇర్ఫాన్ ఖాన్ - రిషి కపూర్ మరణించిన విషయం తెలిసిందే. ఓ పక్క దిగ్గజ నటులు చనిపోయారు. మరోపక్క ఇండస్ట్రీ మొత్తం మూగబోయింది. సెలెబ్రిటీలందరూ సోషల్ మీడియాలో సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి సమయాల్లో కూడా వారి వక్రబుద్దిని బయట పెడుతున్నారు. వారిలో మొదటగా చెప్పుకోవాల్సింది కమల్ ఆర్ ఖాన్ గురించే. ఈ వివాదాస్పద యాక్టర్ ట్విట్టర్ వేదికగా వీరి మరణాలపై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

''కరోనా వైరస్ కొందరు ఫేమస్ లీడర్స్ ని తీసుకొనిపోనిదే ఇక్కడి నుండి పోదని నేను కొన్ని రోజుల క్రితమే చెప్పాను. అందరూ నన్ను తిడతారని చనిపోయే వారి పేర్లు మాత్రం బయటకి చెప్పలేదు. ఇర్ఫాన్ ఖాన్ మరియు రిషి కపూర్ మరణిస్తారని నాకు ముందే తెలుసు. అంతేకాకుండా నెక్స్ట్ ఎవరు చనిపోతారో కూడా నాకు తెలుసు'' అంటూ వివాదాస్పద ట్వీట్ చేసాడు. దీంతో కమల్ ఆర్ ఖాన్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుకు పడుతున్నారు. ఇద్దరు దిగ్గజ నటులు కోల్పోయి యావత్ సినీ ఇండస్ట్రీ బాధల్లో ఉంటే నువ్వు పిచ్చి వాడిలా ఇలాంటి ట్వీట్స్ చేస్తావా అంటూ విమర్శలు గుప్పించారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కమల్ ఆర్ ఖాన్ పై చర్యలు తీసుకోమని డిమాండ్ చేసారు. ఈ ట్వీట్ వైరల్ అవడంతో ఇప్పుడు ఆ ట్వీట్ ని తొలగించారు. కమల్ ఆర్ ఖాన్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సార్లు ఇలా వేస్ట్ మాటలు మాట్లాడి అందరి ఆగ్రహానికి గురయ్యాడు. టాలీవుడ్ లో రానా, ప్రభాస్ లాంటి హీరోలపై.. బాహుబలి, సాహో లాంటి సినిమాలపై.. రాజమౌళి, సుజిత్ లాంటి దర్శకులపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసాడు. తర్వాత సోషల్ మీడియా వేదికగా మన వారు తిరగబడటంతో క్షమాపణలు చెప్పుకున్నాడు. ఇప్పుడు తాజాగా ఇతడు చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.