Begin typing your search above and press return to search.

తేజు సర్దుకోక తప్పలేదు!

By:  Tupaki Desk   |   3 Nov 2018 6:59 AM GMT
తేజు సర్దుకోక తప్పలేదు!
X
సుప్రీమ్ హీరో ట్యాగ్ తో వరస హిట్లతో రెండేళ్ల క్రితం వరకు ఫుల్ ఫామ్ లో ఉన్న సాయి ధరమ్ తేజ్ మీద డబుల్ హ్యాట్రిక్ పరాజయాలు చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఈ ఏడాది వచ్చిన ఇంటెలిజెంట్-తేజ్ ఐ లవ్ యులు దారుణమైన ఫలితాలు చవి చూసి తేజు సబ్జెక్ట్ సెలక్షన్ మీద అతని మార్కెట్ క్రెడిబులిటీ మీద అనుమానం వచ్చేలా చేశాయి. అందుకే అమెరికా వెళ్ళిపోయి కొంత కాలం గ్యాప్ తీసుకుని మేకోవర్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టిన తేజ్ ఫైనల్ గా కొత్త సినిమా చిత్రలహరి షూటింగ్ ఇటీవలే మొదలుపెట్టుకున్న సంగతి తెలిసిందే.

తిరుమల కిషోర్ దర్శకత్వంలో మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్ లో రెండు పేర్లు చిత్ర-లహరి హీరొయిన్ పాత్రలవి . అంటే కథలో వాళ్ళకు ఎంత ప్రాధాన్యం ఉందో అర్థమవుతోంది కదా. సో తేజు పక్కన నటించే ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు ఎవరు ఉంటారా అనే ఆసక్తి కలగడం సహజం. దానికి సమాధానం దొరికేసింది. ఆ ఇద్దరూ హలోతో పరిచయమైన కళ్యాణి ప్రియదర్శిని కాగా మరొకరు మెంటల్ మదితో పరిచయమై ఆ మధ్య జయం రవి టిక్ టిక్ టిక్ లో కనిపించిన నివేతా పెతురాజ్. నిజానికి ఈ ఇద్దరికీ అంత గుర్తింపు కాని చరిష్మా కాని ప్రేక్షకుల్లో లేదు. కాకపోతే టాలెంట్ తో ఆకట్టుకునే లక్షణమైన అందం అయితే ఉంది. అందుకే ఇమేజ్ ని పట్టించుకోకుండా ఈ ఇద్దరినీ ఓకే చేసినట్టు సమాచారం.

దానికి తోడు తేజు పక్కన అంటే టాప్ ఫాం లో ఉన్న హీరొయిన్లు కాలయాపన చేస్తున్నారట. అందుకే ఇప్పటికే ఆలస్యం అయ్యింది కాబట్టి అందుబాటులో ఈ ఇద్దరినీ తీసుకున్నట్టు టాక్ . చిత్రలహరి హిట్ కొట్టాల్సిన టార్గెట్ తో తేజుతో పాటు దర్శకుడు తిరుమల కిషోర్ కూడా బాగా కష్టపడుతున్నాడు. ఇతని గత చిత్రం ఉన్నది ఒకటే జిందగీ నిరాశ పరిచిన నేపధ్యంలో మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చి పడింది.