Begin typing your search above and press return to search.

కళ్యాణ్‌ రామ్‌ తెలివైన పనిచేశాడు

By:  Tupaki Desk   |   20 Oct 2015 8:12 PM IST
కళ్యాణ్‌ రామ్‌ తెలివైన పనిచేశాడు
X
అక్టోబర్ 22కి బాగా రష్ ఎక్కువయిపోయింది. దీంతో షేర్ ను ముందుగా అనుకున్నట్లుగానే అక్టోబర్ 30నే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యాడు కళ్యాణ్ రామ్. అసలు 22కి సిద్ధమవుతుందో లేదో అనే అనుమానాలున్నా.. సెన్సార్ కంప్లీట్ చేశాక కూడా రిలీజ్ ఆపేయాలని నిర్ణయించుకున్నాడు.

అఖిల్ వాయిదా పడేసరికి.. పండుగ రోజుల్లో వచ్చేందుకు సినిమాలు వరుస కట్టేశాయి. క్రిష్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న కంచె, కళ్యాణ్ రామ్ షేర్ - ఓంకార్ డైరెక్షన్ లో వస్తున్న రాజుగారి గది - సుమంత్ అశ్విన్ హీరోగా కొలంబస్ లు అక్టోబర్ 22ను రిలీజ్ డేట్ గా సెట్ చేసుకున్నాయి. అయితే.. అంతకు ముందే రిలీజైన రుద్రమదేవి - బ్రూస్ లీ చిత్రాలను అన్ని థియేటర్లలోంచి పూర్తిగా తీసేయడం సాధ్యమయ్యే విషయం కాదు. ప్రధాన సెంటర్లలో వీటికి అగ్రిమెంట్స్ ఉండడంతోపాటు.. సేఫ్ జోన్ లో ఉన్నంతవరకూ తీసేయడం కూడా సాధ్యం కాదు.

ఇన్ని సినిమాల పోటీతో.. కొత్తగా వచ్చే మూవీస్ అరకొరా థియేటర్లతో సరిపెట్టుకోవాలి. ఇది అన్ని మూవీస్ కి రిస్కీ వ్యవహారమే. అందుకే అక్టోబర్ 30నే షేర్ ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు కళ్యాణ్ రామ్.