Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్‌ లో ఎన్టీఆర్‌ వాటాపై కళ్యాణ్ రామ్‌ క్లారిటీ

By:  Tupaki Desk   |   4 Aug 2022 10:30 AM GMT
ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్‌ లో ఎన్టీఆర్‌ వాటాపై కళ్యాణ్ రామ్‌ క్లారిటీ
X
నందమూరి కళ్యాణ్ రామ్‌ బింబిసార సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. సినిమా ను కళ్యాణ్ రామ్ గత రెండు వారాలుగా చాలా యాక్టివ్‌ గా ప్రమోట్‌ చేశాడు. సినిమా ప్రమోషన్ కోసం చాలా భారీగానే ప్లాన్‌ చేసిన హీరో కమ్‌ నిర్మాత కళ్యాణ్ రామ్‌ తాను అనుకున్నట్లుగా జనాల్లోకి సినిమా ను తీసుకు వెళ్లడం లో సక్సెస్ అయ్యాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఎన్నో మీడియా సంస్థలతో మాట్లాడటం తో పాటు.. పలు మీడియా సమావేశాల్లో పాల్గొన్నాడు. ప్రత్యేక ఇంటర్వ్యూలతో నిన్నటి వరకు కూడా బిజీ బిజీగానే ఉన్నాడు.

తాజా ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న నిర్మాతల సమ్మె గురించి ప్రస్తుతానికి ఆలోచించలేదు.. దాని గురించి తెలుసుకోలేదు.

నేను ప్రస్తుతం బింబిసార సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాను. సినిమా విడుదల తర్వాత తన తదుపరి సినిమాల యొక్క నిర్మాతలతో మాట్లాడుతాను అంటూ కళ్యాణ్ రామ్‌ చెప్పుకొచ్చాడు. బాబాయ్ బాలకృష్ణ కు ఒక కథ చెప్పించాను. ఆయనకు నచ్చలేదు. నచ్చిన కథ తో వస్తే తప్పకుండా నా బ్యానర్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్ లో చేస్తానంటూ హామీ ఇచ్చాడు.

ఇక తమ్ముడు ఎన్టీఆర్‌ నటిస్తున్న వరుస సినిమాలకు నిర్మాణ భాగస్వామిగా ఉండటం పట్ల కళ్యాణ్‌ రామ్‌ స్పందించాడు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ బ్యానర్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌ కు హోం బ్యానర్‌ అన్నట్లుగా మారింది.

ఆ బ్యానర్‌ లో ఎన్టీఆర్‌ కు భాగస్వామ్యం ఉందని అంతా భావిస్తున్నారు. ఆ విషయమై కళ్యాణ్ రామ్‌ తో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ లో ఎన్టీఆర్‌ షేర్ ఎంత అంటూ మీడియా వారు ప్రశ్నించగా అందుకు కళ్యాణ్ రామ్‌ స్పందిస్తూ.. మేము అంతా ఒక ఫ్యామిలీ.. మా మధ్య ఎలాంటి లెక్కలు ఉండవు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

కళ్యాణ్ రామ్‌ సినిమా లకు ఎన్టీఆర్‌ సాధ్యం అయినంత మేరకు ప్రమోషన్ చేస్తూ అన్నకు సాయంగా నిలుస్తున్నాడు. అంతే కాకుండా తమ్ముడు సినిమాల యొక్క నిర్మాణ భాగస్వామిగా ఉండటం వల్ల కూడా కళ్యాణ్ రామ్‌ అంతో ఇంతో లాభాలను దక్కించుకుంటున్నాడు. మరి కళ్యాణ్ రామ్ వల్ల ఎన్టీఆర్‌ కు వస్తున్న లాభం ఏంటి... ఎన్టీఆర్‌ పొందుతున్న ప్రయోజనం ఏంటీ అంటూ కొందరు ఎన్టీఆర్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు.