Begin typing your search above and press return to search.

మెగా అల్లుడు అక్కడ కూడా అడుగుపెట్టబోతున్నాడా...?

By:  Tupaki Desk   |   22 April 2020 8:50 AM GMT
మెగా అల్లుడు అక్కడ కూడా అడుగుపెట్టబోతున్నాడా...?
X
ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా హీరోల హవా కొనసాగుతోంది అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవిని మొదలుకొని రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వరకు అందరూ మంచి ఫార్మ్ లో ఉన్నారు. వరుస సినిమాలను లైన్లో పెడుతూ మెగా ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరంజీవి అల్లుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కళ్యాణ్ దేవ్ కూడా రెండు సినిమాలను ఓకే చేసాడు. 'విజేత' సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన కళ్యాణ్ ఈ చిత్రం పరాజయం కావడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు.

ఈ క్రమంలో కళ్యాణ్ దేవ్ తన రెండవ చిత్రంగా 'సూపర్ మచ్చి' చిత్రాన్ని పట్టాలెక్కించాడు. ఈ చిత్రానికి పులివాసు దర్శకత్వం వహిస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రిజ్వాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో రియా చక్రవర్తి మరియు రచితా రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర బృందం ఈ తర్వాత ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయకొచ్చింది.

'సూపర్ మచ్చి' సినిమాని తెలుగుతో పాటు క‌న్న‌డ‌లో కూడా సేమ్ టైమ్ కి రిలీజ్ చేయాల‌ని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఈ సినిమాలో క‌న్న‌డ న‌టుల్ని కూడా తీసుకున్నార‌ని సమాచారం. ఈ క్రమంలోనే క‌న్న‌డ స్టార్ హీరోయిన్ ర‌చిత రామ్ ని హీరోయిన్ గా తీసుకున్నారట. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి వచ్చే అన్ని సినిమాలు కన్నడ లో కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మెగా అల్లుడిని కూడా కన్నడిగులు పరిచయం చేయాలని మెగా కాంపౌండ్ భావిస్తోందట. అంతే కాకుండా లాక్ డౌన్ త‌రువాత చిరు ప్ర‌భావంతో ఈ ప్రాజెక్ట్ కి రిలీజ్ క‌ష్టాలు త‌ప్పుతాయ‌నే టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో న‌డుస్తోంది. ఇదిలావుండగానే కళ్యాణ్ దేవ్ మరో చిత్రాన్నీ కూడా లైన్ లో పెట్టాడు. శ్రీధర్ సీపాన దర్శకత్వం లో ఒక సినిమాకి కమిట్ అయినట్లు ప్రకటించాడు. టీజీ విశ్వప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జిఎటూ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్నారు. మరి ఈ చిత్రాల ద్వారా మెగా అల్లుడు విజయాల బాట పెడతాడేమో చూడాలి.