Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ 30 : బంటు కంటే ఎక్కువ ఇవ్వాలంటూ బెట్టు

By:  Tupaki Desk   |   1 Jun 2020 5:45 AM GMT
ఎన్టీఆర్‌ 30 : బంటు కంటే ఎక్కువ ఇవ్వాలంటూ బెట్టు
X
రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంతో ఎన్టీఆర్‌ కు పాన్‌ ఇండియా క్రేజ్‌ రావడం ఖాయం. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత చేయబోతున్న సినిమా ఖచ్చితంగా ఆల్‌ ఓవర్‌ ఇండియా విడుదల అయ్యి భారీగా వసూళ్లను రాబట్టడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు మరియు ఫ్యాన్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకే ఎన్టీఆర్‌ తదుపరి చిత్రాన్ని చేయబోతున్న త్రివిక్రమ్‌ పాన్‌ ఇండియా స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడట. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాల్లో కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడట. విభిన్నమైన యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ డ్రామా స్క్రిప్ట్‌ ను త్రివిక్రమ్‌ సిద్దం చేశాడని అంటున్నారు. ఎన్టీఆర్‌ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడే సినిమాను పట్టాలెక్కించేందుకు త్రివిక్రమ్‌ సిద్దంగా ఉన్నాడట. అయితే పారితోషికం విషయంలో ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదని అంటున్నారు. అల వైకుంఠపురంలో సినిమాకు గాను అల్లు అర్జున్‌ 36 కోట్లు తీసుకున్నాడట. ఎన్టీఆర్‌ ఇప్పుడు అంతకు మించిన పారితోషికంను ఇవ్వాల్సిందే అంటూ బెట్టు చేస్తున్నాడట.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో పాన్‌ ఇండియా గుర్తింపు రావడంతో ఖచ్చితంగా సినిమాకు మంచి బిజినెస్‌ అవుతుంది. అందుకే 40 కోట్లు ఇవ్వాల్సిందే అంటూ ఎన్టీఆర్‌ డిమాండ్‌ చేస్తున్నాడట. తన అన్న కళ్యాణ్‌ రామ్‌ మరియు రాధాకృష్ణు ఈ సినిమాకు నిర్మాతలు అనే విషయం తెల్సిందే. కళ్యాణ్‌ రామ్‌ ఓకే చెప్పినా త్రివిక్రమ్‌ ఇంకా రాధాకృష్ణ లు పారితోషికం విషయంలో ఎన్టీఆర్‌ కు హామీ ఇవ్వలేక పోతున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో యూనిట్‌ సభ్యుల ద్వారా క్లారిటీ రావాల్సి ఉంది.