Begin typing your search above and press return to search.

జోగిపేట్ To బాంబే : ప్రభాస్ ను కలిసిన జాతిరత్నాలు

By:  Tupaki Desk   |   4 March 2021 9:04 AM GMT
జోగిపేట్ To బాంబే : ప్రభాస్ ను కలిసిన జాతిరత్నాలు
X
'ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేమ్‌ నవీన్‌ పోలిశెట్టి హీరోగా అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ''జాతిరత్నాలు''. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌ గా నటించగా.. ప్రియదర్శి - రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదలవుతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్.. ‘జాతిరత్నాలు’ ట్రైలర్ ను పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో రిలీజ్ చేయిస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ట్రైలర్ లాంచ్ కోసం 'జాతిరత్నాలు' టీమ్ జోగిపేట్ నుంచి ముంబైకి వెళ్ళిన నేపథ్యంలో ఓ ఫన్నీ వీడియోని చిత్ర బృందం వదిలింది.

'జాతిరత్నాలు - జోగిపేట్ To బాంబే' పేరుతో విడుదల చేసిన ఈ వీడియోలో ట్రైలర్ లాంచ్ కోసం ప్రభాస్ ని కలవడానికి మన జాతిరత్నాలు చేసిన రచ్చను చూపించారు. ఫ్లైట్ బయలుదేరినప్పటి నుంచి ప్రభాస్ ని మీట్ అయ్యే వరకు నవీన్‌ పోలిశెట్టి - ప్రియదర్శి - ఫరియా - డైరెక్టర్ అనుదీప్‌ సందడి సందడి చేసేశారు. చివరకు డార్లింగ్ ప్రభాస్ ని కలిసి 'జాతిరత్నాలు' ట్రైలర్ ని విడుదల చేయించారు. ట్రైలర్ చూసిన ప్రభాస్.. చాలా బాగుందని, చిన్న వీడియోతోనే పదిసార్లు నవ్వానని.. ఇంక సినిమా ఎలా ఉంటుందో అర్థం అవుతోందని చిత్ర బృందాన్ని అభినందించాడు. వినూత్నంగా ప్లాన్ చేసిన ఈ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 'జాతిరత్నాలు' ట్రైలర్ ఈరోజు సాయంత్రం గం. 4:20 నిమిషాలకు అందుబాటులోకి రానుంది. ఇప్పటికే టైటిల్, పోస్టర్స్, టీజర్ లతో ఆకట్టుకున్న 'జాతిరత్నాలు'.. ప్రభాస్ వదిలే ట్రైలర్ తో మరోసారి నవ్వించబోతున్నారని అర్థం అవుతుంది.