Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టార్ హీరోకు షాకిచ్చిన జాన్వీ

By:  Tupaki Desk   |   22 Feb 2022 9:33 AM GMT
టాలీవుడ్ స్టార్ హీరోకు షాకిచ్చిన జాన్వీ
X
`బాహుబ‌లి` త‌రువాత దేశం మొత్తం టాలీవుడ్ సినిమా వైపే ఆస‌క్తిగా చూస్తోంది. ఏ సినిమా మొద‌లైనా ఏదో కొత్త‌గా చేయ‌బోతున్నారంటూ ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ లు వెంట‌నే రంగంలోకి దిగి రైట్స్ కోసం భారీ పోటీ నెల‌కొన్నా ఫ్యాన్సీ ఆఫ‌ర్ ఇచ్చేసి మ‌రీ కొనేస్తున్నారు. ఇదిలా వుంటే తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ల క‌న్నుకూడా టాలీవుడ్ పై ప‌డింది.

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ మూవీ మార్చి 25న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీతో బాలీవుడ్ క్రేజీ లేడీ అలియా భ‌ట్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అవుతోంది.

అలియా న‌టించిన మూవీ విడుద‌ల కాకుండానే తెలుగులో మ‌రో క్రేజీ మూవీ ఆఫ‌ర్ ని సొంతం చేసుకుంది. మ‌రి కొంత మంది స్టార్ హీరోయిన్ లు టాలీవుడ్ హీరోల‌తో రొమాన్స్ చేయ‌డానికి ఆస‌క్తిని చూపిస్తున్నారు. ప్ర‌భాస్ న‌టిస్తున్న `ప్రాజెక్ట్ కె`తో తెలుగులో ప‌రిచ‌యం అవుతున్న దీపికా ప‌దుకునే కూడా తెలుగులో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల‌తో న‌టించాల‌ని వుంద‌ని స్టేట్ మెంట్ ఇచ్చేసింది. అంతే కాకుండా మ‌రో ఇద్ద‌రు బాలీవుడ్ హీరోయిన్ లు అన‌న్య పాండే, కియారా అద్వానీ కూడా తెలుగులో సినిమాలు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో మ‌న స్టార్ హీరోలు చూపు ఇప్ప‌డు బాలీవుడ్ హీరోయిన్ పై ప‌డింది. ఏ హీరో బిగ్ మూవీ స్టార్ట్ చేసినా ఉత్త‌రాది మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోయిన్ కావాలనే స్థాయికి వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం ఓ స్టార్ హీరో త‌న‌కు బాలీవుడ్ హీరోయిన్ కావాలంటుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. లింగుస్వామి డైరెక్ష‌న్ లో `ది వారియ‌ర్‌` మూవీ చేస్తున్న రామ్ ఈ మూవీ త‌రువాత బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ష‌న్ లో హై వోల్టేజ్ యాక్ష‌న్ మూవీ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

శ్రీ‌నివాస చిట్టూరి నిర్మించ‌నున్న ఈ చిత్రం రామ్ కు 20వ సినిమా. స‌మ్మ‌ర్ లో సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ చిత్రంలో రామ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ ని అనుకుంటున్నార‌ట‌. ఇందు కోసం జాన్వీ క‌పూర్ - కియారా అద్వానీ - అన‌న్య పాండేల‌ని ట్రై చేస్తున్నార‌ట‌. ఇందులో మేక‌ర్స్ కి జాన్వీ క‌పూర్ నో చెప్పేసిందని వార్త‌లు వినిపిస్తున్నాయి. అన‌న్య పాండే లేదా కియారాని సంప్ర‌దించాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. కియారా ఇప్ప‌టికే రామ్ చ‌రణ్ మూవీలో న‌టిస్తోంది. దీని త‌రువాతే మ‌రో సినిమాని అంగీక‌రించాల‌నుకుంటోంద‌ట‌.

దీంతో మేక‌ర్స్ బాలీవుడ్ లో మ‌రో క్రేజీ హీరోయిన్ కోసం వెతక‌డం ప్రారంభించార‌ని తెలిసింది. బోయ‌పాటి శ్రీ‌ని కొంత విరామం త‌రువాత `అఖండ‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ ని సొంతం చేసుకుని మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ ఇచ్చిన స‌క్సెస్ జోష్ లో వున్న బోయ‌పాటి శ్రీ‌ను త‌న త‌వుప‌రి చిత్రాన్ని బ‌న్నీతో చేయాల‌నుకున్నారు కానీ బ‌న్నీ `పుష్ప -2` ప‌నుల్లో బిజీగా వుండ‌టంతో బోయ‌పాటి ఫైన‌ల్ గా రామ్ తో సినిమాకు రెడీ అయిపోయిన విష‌యం తెలిసిందే.