Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ : ఇప్పటికైనా నన్ను గుర్తిస్తారా?

By:  Tupaki Desk   |   30 May 2021 2:30 PM GMT
ఫొటోటాక్‌ : ఇప్పటికైనా నన్ను గుర్తిస్తారా?
X
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా పరిచయం అయ్యి వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. బాలీవుడ్‌ లో బిజీ బ్యూటీగా పేరు దక్కించుకున్న ఈ అమ్మడు ఈమద్య కాలంలో తనలోని కొత్త కళలను బయటకు తీస్తోంది. మల్టీ ట్యాలెంటెడ్‌ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం షూటింగ్‌ లు లేకపోవడంతో పూర్తిగా పెయింటింగ్‌ పై దృష్టి పెట్టింది. పెయింటింగ్‌ వేస్తున్న ఫొటోలతో పాటు తాను వేసిన పెయింటింగ్స్‌ ను కూడా సోషల్‌ మీడియా ద్వారా జాన్వీ కపూర్‌ షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం ముద్దుగుమ్మ షేర్‌ చేసిన ఈ ఫొటో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

అందమైన పెయింటింగ్స్‌ తో పాటు అంతకంటే అందమైన థైస్ ను కూడా ఈ అమ్మడు చూపిస్తుందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. అంత అందమైన థైస్ ఉంటే మీరు వేసిన పెయింటింగ్‌ ఎంత అందంగా ఉన్నా కూడా ఎలా చూస్తామంటూ మరి కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అందమైన అమ్మాయి రూపును వేసిన జాన్వీ కపూర్‌ తన ఫేస్ చూపించకుండా కేవలం థైస్ మాత్రమై చూపిస్తూ ఇప్పటికి అయినా నన్ను నేను పెయింటర్‌ గా గుర్తించుకోవచ్చా అంటూ ప్రశ్నించింది.

జాన్వీ కపూర్‌ కు చాలా మంది రియాక్ట్‌ అవుతున్నారు. మీరు ఒక మంచి పెయింటర్‌ మాదిరిగా ఆ పెయింటింగ్‌ ను వేశారు. మీ చేతిలో అద్బుతమైన కళ ఉందంటూ మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె తమిళంలో నయనతార చేసిన ఒక సినిమాను హిందీలో రీమేక్ చేస్తుంది. ఆ సినిమా తో పాటు మరి కొన్ని సినిమాల చర్చలు కూడా జరుగుతున్నాయి.