Begin typing your search above and press return to search.

బాంబ్ పేల్చ‌డంలో జాన్వీ ఎక్స్ ప‌ర్ట్ క్వాలిటీ

By:  Tupaki Desk   |   24 April 2022 2:30 AM GMT
బాంబ్ పేల్చ‌డంలో జాన్వీ ఎక్స్ ప‌ర్ట్ క్వాలిటీ
X
ఎక్స్ ప్లోజివ్స్ పేల్చాలంటే స్పెష‌లిస్టుల్ని బ‌రిలో దించాలి. కానీ ఇక్క‌డ అనుభ‌వంతో ప‌నే లేకుండా అలాంటి ఎక్స్ ప్లోజ‌న్స్ కి కార‌ణ‌మ‌వుతోంది ఈ అందాల న‌ట‌వార‌సురాలు. అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి వార‌సురాలు జాన్వీ క‌పూర్ గురించే ఇదంతా.

బ్యాక్ టు బ్యాక్ .. రోజుకో గంట‌కో ఫోటోషూట్ తో విరుచుకుప‌డ‌డం ఈ అమ్మ‌డి ప్ర‌త్యేక‌త‌. బికినీలు.. స్విమ్ సూట్లు .. డిజైన‌ర్ సూట్ లు.. మ్యాగ‌జైన్ క‌వ‌ర్ షూట్లు ఈ అమ్మ‌డికి కొత్తేమీ కాదు. కానీ ఈసారి మ‌రింత హాట్ గా ఫిలింఫేర్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పై ద‌ర్శ‌న‌మిచ్చింది. సాట‌ర్ డే సిజిల్స్ పేరుతో జాన్వీ షేర్ చేసిన ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలాన్ని ఒణికిస్తోంది.

బ్లాక్ టాప్ పై బ్లూ లైన‌ర్ తో కిక్కిస్తోంది జాన్వీ టాప్. దానికి కాంబినేష‌న్ ఫ్యాంట్ ని ధ‌రించింది ఈ అందాల భరిణె. జాన్వీ ఒంపుసొంపుల వ‌య్యారం వ‌డ్డ‌నలు పీక్స్ అని చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.వీడీతో దూసుకొస్తోందా?

పూరి జగన్నాధ్ 'JGM' కోసం యంగ్ ట్యాలెంటెడ్ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ని ఎంపిక చేసార‌ని.. విజయ్ దేవరకొండకు జోడీగా న‌టిస్తుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. తన తాజా ఇంటర్వ్యూలో జాన్వీ ఈ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చింది. ''ఊహాగానాలు నమ్మవద్దు. నేను ఇంకా ఏ తెలుగు లేదా తమిళ చిత్రానికి సైన్ చేయలేదు. నేను ఒక సంతకం చేస్తే.. నేను కానీ నా ప్రొడక్షన్ హౌస్ కానీ దానిని ధృవీకరిస్తాం'' అని జాన్వి తెలిపింది. JGM లో న‌టిస్తున్నారా? అని తాజా ఇంట‌ర్వ్యూలో అడ‌గ్గా.. జాన్వీ పైవిధంగా బదులిచ్చారు. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ -పూరీ జగన్నాధ్ కాంబినేష‌న్ లో రూపొంద‌నున్న సినిమా JGM. జ‌న‌గ‌న‌మ‌ణ అనేది టైటిల్ పూర్తి రూపం. నిజానికి ఈ ప్రాజెక్టులో మ‌హేష్ లేదా ప‌వ‌న్ న‌టించాల్సి ఉండ‌గా అట్నుంచి లైన్ క్లియ‌ర్ కాలేదు. దీంతో పూరి లైగ‌ర్ స్టార్ దేవ‌ర‌కొండ‌తో వెంట‌నే ఈ ప్రాజెక్ట్ ని ప్ర‌క‌టించాడు. పూరి- ఛార్మి వ‌రుస పాన్ ఇండియా సినిమాల్ని నిర్మిస్తూ హీట్ పెంచేస్తున్నారు.

బాలీవుడ్ లో జాన్వీ స్పీడ్ జాన్వీ బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీ బిజీ. ప్ర‌స్తుతం 'మిస్ట‌ర్ అండ్ మిసెస్ మ‌హి' చిత్రంతో మెస్మ‌రైజ్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది జాన్వీ క‌పూర్. ఈ చిత్రంలో జాన్వీ పెళ్ల‌యిన యువ‌తిగా.. మ‌హిళా క్రికెట‌ర్ గా క‌నిపించ‌నుంది. మిస్టర్ అండ్ మిసెస్ మహిలో జాన్వీ - రాజ్ కుమార్ వరుసగా మహేంద్ర -మహిమ అనే పాత్రలను పోషించనున్నారు. శరణ్ శర్మతో జాన్వీకి ఇది రెండో ప్రాజెక్ట్. జాన్వీ కపూర్ టైటిల్ రోల్ లో నటించిన 2020 చిత్రం 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్' శ‌ర‌ణ్ కి దర్శకుడిగా రెండో సినిమా. భారతదేశంలో క్రికెట్ కు విపరీతమైన ఆదరణ ఉన్నందున ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడుతుందో చూడాల‌న్న‌ ఆసక్తిని పెంచుతోంది.

జాన్వీ న‌టించిన దోస్తానా 2 .. గుడ్ ల‌క్ జెర్రీ పైనా ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. ఆమె చేతిలో మిల్లీ అనే మ‌రో క్రేజీ సినిమా కూడా ఉంది.. ఒక నటిగా అండర్-ఎక్స్‌పోజ్డ్ ఫీలింగ్ గురించి కపూర్ గాళ్ థ్రిల్లింగ్ గా ఉన్నాన‌ని తెలిపింది. మిల్లీలో ఆమె తన తండ్రి నిర్మాత బోనీ కపూర్ తో కలిసి పని చేయడం ఆస‌క్తిక‌రం. మరోవైపు విజ‌య్ దేవ‌ర‌కొండ శివ‌నిర్వాణ‌- స‌మంత‌ల‌తో క‌లిసి క‌శ్మీర్ నేప‌థ్యంలో ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిన‌దే.