Begin typing your search above and press return to search.

శ్రీదేవి తమిళ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌

By:  Tupaki Desk   |   7 Feb 2019 12:00 PM GMT
శ్రీదేవి తమిళ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌
X
తమిళం, తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌ గా ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి బాలీవుడ్‌ లో సూపర్‌ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్‌ కు వెళ్లిన శ్రీదేవి మళ్లీ సౌత్‌ సినీ ఇండస్ట్రీకి వచ్చింది లేదు. సెకండ్‌ ఇన్నింగ్స్‌ లో ఒక చిత్రంలో కీలక పాత్ర పోషించినా కూడా శ్రీదేవి ఆ చిత్రంలో ఆకట్టుకోలేక పోయింది. శ్రీదేవి మరణ వార్త తెలుగు, తమిళ పరిశ్రమల్లో మరియు ఆమె అభిమానుల్లో తీవ్ర శోకం నిపించింది. ఆమె వారసురాలు జాన్వీ కపూర్‌ అయినా తమిళంలో సినిమా చేస్తే చూడాలనుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక తమిళ సినిమాలో జాన్వీ కపూర్‌ నటించేందుకు ఓకే చెప్పింది.

'పింక్‌' చిత్రంను తమిళంలో రీమేక్‌ చేస్తున్నారు. అజిత్‌ హీరోగా విద్యా బాలన్‌ హీరోయిన్‌ గా రూపొందబోతున్న ఈ చిత్రంను బోణీ కపూర్‌ నిర్మించబోతున్నాడు. తన తండ్రి నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం అవ్వడం వల్ల 'పింక్‌' తమిళ రీమేక్‌ లో కీలక పాత్రను పోషించేందుకు ఓకే చెప్పింది. త్వరలోనే చిత్రీకరణలో జాన్వీ పాల్గొనబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఆమద్య బాలీవుడ్‌ కే తన మొదటి ప్రాధాన్యత అంటూ చెప్పుకొచ్చిన జాన్వీ కపూర్‌ భవిష్యత్తులో తమిళంలో ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌ పాత్రలు చేయాలని అంతా కోరుకుంటున్నారు. హీరోయిన్‌ గా కాకున్నా కనీసం గెస్ట్‌ రోల్‌ లో అయినా శ్రీదేవి వారసురాలు తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నందుకు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.