Begin typing your search above and press return to search.

సందీప్ వంగ ప్రాజెక్ట్ ఇంకా ఖాయం కాదా?

By:  Tupaki Desk   |   28 Sep 2019 1:30 AM GMT
సందీప్ వంగ ప్రాజెక్ట్ ఇంకా ఖాయం కాదా?
X
అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసిన సందీప్ రెడ్డి వంగా అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకున్న సంగ‌తి తెలిసిందే. టీసిరీస్ భూష‌ణ్ కుమార్ ఆ చిత్రాన్ని నిర్మించారు. ఆ వెంట‌నే సందీప్ ని ఎటూ పోకుండా మ‌రో సినిమాకి లాక్ చేశారు ఆయ‌న‌. ప్ర‌స్తుతం సందీప్ రెడ్డి వంగా మ‌రో హిందీ సినిమా కోసం స్క్రిప్టును రెడీ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో ర‌ణ‌బీర్ క‌పూర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నాడ‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ర‌ణ‌బీర్ తో ఖాయ‌మైన‌ట్టేన‌ని ప్ర‌చార‌మైంది.

అయితే తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం.. ఇంత‌వ‌ర‌కూ న‌టుడు ఎవ‌రు? అన్న‌ది ఫైన‌ల్ కాలేదు. ర‌ణ‌బీర్ ని ఎంపిక చేశారు అన్న‌ది నిజం కాదని తేలింది. క‌బీర్ సింగ్ చిత్రం త‌ర్వాత ఒక డార్క్ క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశాన్ని సందీప్ రాస్తున్నారు. డెవిల్ అనే పేరుతో తెర‌కెక్కించాల‌ని అనుకున్నాడు. స్క్రిప్టు రెడీ అయ్యాక ర‌ణ‌బీర్ ని క‌లిశాడు. ర‌ణ‌బీర్ త‌న‌కు స్క్రిప్టు న‌చ్చింద‌ని అన్నాడు. అయితే దీనిపై క‌న్ఫ‌ర్మేష‌న్ మాత్రం ఇవ్వ‌డం లేదు. అందుకే ఇప్ప‌టికీ హీరో ఎవ‌రు అన్న‌ది ఫైన‌ల్ కాలేద‌ట‌.

ఈ విష‌యాన్నే భూష‌ణ్ కుమార్ ఇటీవ‌ల మ‌ర్జ‌వాన్ ప్ర‌మోష‌న్స్ లో కాస్త అటూ ఇటూగా తెలిపారు. సందీప్ వంగాతో సినిమా చేస్తున్నాం .. కానీ న‌టుడు ఎవ‌రూ ఫైన‌ల్ కాలేదు. స్క్రిప్టు ఇంకా రెడీ అవుతోంది. అయ్యాక మాత్ర‌మే ప్ర‌క‌టిస్తాం అని తెలిపారు. ఇంకా ఏ న‌టుడినీ క‌ల‌వ‌లేదు అని అంటున్నా ర‌ణ‌బీర్ ని క‌లిసి క‌థ వినిపించింది నిజ‌మేన‌ని బాలీవుడ్ మీడియా చెబుతోంది. మ‌ర్జావాన్ ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌లో భూష‌ణ్ కుమార్ స‌గం చెప్పారు. కొంత దాచేశార‌ని భావిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా-రితేష్ దేశ్ ముఖ్- తారా సుతారియా- ర‌కుల్ ప్రీత్ తారాగ‌ణంగా మిలాప్ జ‌వేరి ద‌ర్శ‌క‌త్వంలో టీసిరీస్ తెర‌కెక్కించిన మ‌ర్జవాన్ ట్రైల‌ర్ ఇటీవ‌లే రిలీజై ఆక‌ట్టుకుంది.