Begin typing your search above and press return to search.

ఆ డైరెక్ట‌ర్లి ఇద్ద‌రి మ‌ధ్య నిర్మాత న‌లిగిపోతున్నాడా?

By:  Tupaki Desk   |   3 Jan 2023 9:30 AM GMT
ఆ డైరెక్ట‌ర్లి ఇద్ద‌రి మ‌ధ్య నిర్మాత న‌లిగిపోతున్నాడా?
X
రౌడీబోయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ రేంజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 'లైగ‌ర్' ప్లాప్ కొన్ని లెక్క‌లు స‌రి చేసిన‌ప్ప‌టికీ విజ‌య్ మార్కెట్ పై ఆ ప్ర‌భావం పెద్ద‌గా ప‌డ‌లేదు. డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ అనూహ్యంగా జ‌న‌గ‌ణ‌మ‌న ప్రాజెక్ట్ మ‌ధ్య‌లోనే ఆపేసినా? విజ‌య్ ఎక్క‌డా కింగ‌లేదు. స్టార్ డైరెక్ట‌ర్లు అంతా అత‌నితో సినిమాలు చేయ‌డానికి క్యూ క‌డుతున్నారు.

బ‌డా నిర్మాణ సంస్థ‌లు అదే వ‌రుస‌లో క‌నిపిస్తున్నాయి. తాజాగా విజ‌య్ కోసం ఓ ఇద్ద‌రి ద‌ర్శ‌కుల మ‌ధ్య గ‌ట్టి పోటీ క‌నిపిస్తుంది. విజ‌య్ హీరోగా దిల్ రాజు ఓ సినిమా నిర్మించాల్సి ఉంది. 'ఖుషీ' త‌ర్వాత ఆ బ్యాన‌ర్లోనే విజ‌య్ సినిమా చేయ‌నున్నాడు. అయితే ఇంకా ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు ఎవ‌రు? అన్న‌ది ఫైన‌ల్ కాలేదు. ఈ నేప‌థ్యంలో ఈ ఛాన్స్ కోసం ప‌ర‌శురాం...క‌న్న‌డ ద‌ర్శ‌కుడు న‌ర్త‌న్ పోటీ ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే ద‌ర్శ‌కులు ఇద్ద‌రు విజ‌య్ స‌హా రాజు గారికి క‌థ తో మెప్పించి రెడీగా ఉన్నారుట‌. ఇందులో ఏ క‌థ తీసేయాల్సింది కాదు. విజ‌య్ కి ప‌క్కాగా యాప్ట్ అయ్యే స్ర్కిప్ట్ లుట‌. అయితే ముందుగా ఎవ‌రితో ముందుకెళ్లాలో తెలియ‌ని క‌న‌ప్యూజ‌న్ లో రాజుగారు..విజ‌య్ ప‌డిన‌ట్లు స‌మాచారం. ప‌ర‌శురాం ముందు త‌న ప్రాజెక్ట్ ని పూర్తి చేయ‌మ‌ని కోరుతున్నాడుట‌.

'స‌ర్కారు వారి వారి' పాట త‌ర్వాత ప‌ర‌శురాం ఇంత వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించ‌లేదు. హిట్ ఇచ్చినా ఇంకా సినిమా ఎందుకు చేయ‌లేదు అన్న నెగిటివ్ టాక్ మొద‌లైంది. దాన్ని తొల‌గించుకోవాలంటే అనౌన్స్ మెంట్ రావాలి. అది విజ‌య్ తోనే అవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతున్నాడుట‌. ఇక నార్త‌న్ ఇన్నోవేటివ్ క‌థ‌తో పాటు... రామ్ చ‌ర‌ణ్ తోనూ ఓ సినిమా చేస్తున్నాడు.

ఇప్పుడున్న పాన్ ఇండియా క్రేజ్ న‌డుమ నార్త‌న్ ని వెయిట్ చేయించ‌కూడ‌ద‌ని రాజుగారు భావిస్తున్నారుట‌. అలాగే ప‌ర‌శురాంని తక్కువ చేయ‌డానికి లేదు. ఇలా ఇద్ద‌రి మ‌ధ్య రాజుగారు స‌హా...విజ‌య్ కొంత క‌న్ ప్యూజ‌న్ కి గుర‌వుతున్న‌ట్లు క‌నిపిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.