Begin typing your search above and press return to search.

రామ్ చ‌ర‌ణ్‌ కు మ‌ళ్లీ ఆ స్టార్ హీరోనే విల‌న్‌నా..?

By:  Tupaki Desk   |   22 March 2022 5:25 AM GMT
రామ్ చ‌ర‌ణ్‌ కు మ‌ళ్లీ ఆ స్టార్ హీరోనే విల‌న్‌నా..?
X
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న 15వ చిత్రాన్ని ఇండియాలోనే స్టార్ డైరెక్ట‌ర్‌గా గుర్తింపు పొందిన శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. అంజ‌లి, శ్రీ‌కాంత్, న‌వీన్ చంద్ర, జ‌యరామ్‌, సునీల్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై బ‌డా నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌ను వెచ్చించి పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. త‌మ‌న్‌ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

'ఆర్సీ 15' వ‌ర్కింగ్ టైటిట్‌లో సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ఇందులో రామ్ చరణ్ ఎలక్షన్ కమీషనర్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. అలాగే ఈ మూవీకి 'సర్కారోడు' అనే టైటిల్‌ను రిజిస్ట‌ర్ చేయించిన‌ట్లు టాక్ ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ‌రో ఇంట్ర‌స్టింగ్ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అదేంటంటే.. ఈ పాన్ ఇండియా చిత్రంలో చ‌ర‌ణ్‌కు విల‌న్‌గా ఒక‌ప్ప‌టి స్టార్ హీరో అరవింద స్వామి క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఇప్ప‌టికే సంప్ర‌దింపులు పూర్తి అయ్యాయ‌ని.. నెక్స్ట్ షెడ్యూల్‌లో చ‌ర‌ణ్‌తో పాటు అర‌వింద స్వామి కూడా జాయిన్ కానున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

బొంబాయి, రోజా వంటి చిత్రాల‌తో తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న అర‌వింద స్వామి.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో స్లైలిష్ విల‌న్‌గా దూసుకుపోతున్నాడు.

గ‌తంలో 'ధ్రువ' మూవీలో చరణ్‌కు విలన్ గా న‌టించి మెప్పించిన ఆయ‌న‌.. ఇప్పుడు ఆర్సీ 15లోనూ ఛాన్స్ అందుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. కాగా, చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ 'ఆర్ఆర్ఆర్‌'ను ప్ర‌మోట్ చేసేందుకు ఎన్టీఆర్‌, రాజ‌మౌళిల‌తో క‌లిసి దేశం మొత్తం చుట్టేస్తున్నాడు.

మార్చి 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా వివిధ భాష‌ల్లో ఈ మూవీ విడుద‌ల కాబోతుండ‌గా.. చిత్ర టీమ్ క‌నివివి ఎరుగ‌ని స్థాయిలో ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది.