Begin typing your search above and press return to search.

నిజంగానే 'ఎఫ్ 3' టీమ్ తో తమన్నాకి చెడిందా..?

By:  Tupaki Desk   |   1 Jun 2022 11:30 PM GMT
నిజంగానే ఎఫ్ 3 టీమ్ తో తమన్నాకి చెడిందా..?
X
విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం "ఎఫ్ 3". ఇందులో తమన్నా - మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. దిల్ రాజు నిర్మించిన ఈ మల్టీస్టారర్ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాక్ ఎలా ఉన్నా ఫస్ట్ వీకెండ్ లో మంచి వసూళ్లనే రాబట్టింది.

ఇప్పుడు వీక్ డేస్ లో జనాలను థియేటర్లకు రప్పించడానికి 'ఎఫ్ 3' చిత్ర యూనిట్ ఇంకా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇందులో తమన్నా భాటియా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

'ఎఫ్ 3' హీరోలు వెంకీ - వరుణ్ మరియు దర్శకుడు అనిల్ రావిపూడి రిలీజ్ కు ముందు నుంచే గట్టిగా ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు. చివరకు నిర్మాత దిల్ రాజు సైతం అగ్రేసివ్ గా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందరూ కలిసి వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

అయితే తమన్నా మాత్రం సుమ హోస్ట్ చేసిన ఓ షోకి హాజరైందే తప్ప.. తర్వాత ఏ ప్రోగ్రామ్ లోనూ పాల్గొనలేదు. కనీసం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా మిల్కీ బ్యూటీ రాలేదు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్ళింది కాబట్టి 'ఎఫ్ 3' ప్రమోషన్స్ కు రాలేదని అనుకోవచ్చు. కానీ అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆమె ప్రమోషన్స్ లో కనిపించలేదు.

దీంతో 'ఎఫ్ 3' చిత్ర బృందానికి తమన్నా కు మధ్య విబేధాలు వచ్చాయనే రూమర్స్ నిజమేనా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో లేటెస్టుగా అనిల్ రావిపూడి - దిల్ రాజు మరియు వరుణ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలపై స్పందించారు.

తమన్నా ని ప్రమోషన్స్ కు రమ్మని తాను 20సార్లు అడిగానని.. వాళ్ళ ఫాదర్ కు దిల్ రాజు 15సార్లు కాల్ చేసి ఉంటారని అనిల్ రావిపూడి తెలిపారు. "నాకు ఎప్పుడూ హార్ట్ ఫీలింగ్స్ ఉండవు. నాకు అందరి కంటే సినిమానే ఎక్కువ. సినిమాని మించి నాకు ఏదీ ఎక్కువ కాదు. నాకు ఈగోలు కోపాలు ఫ్రస్ట్రేషన్ ఉండవు. ఎదున్నా అప్పుడే పోతుంది. ఎందుకంటే నేను సినిమాని ఎక్కువగా ప్రేమిస్తాను" అని దర్శకుడు అన్నారు.

"తమన్నా కేన్స్ కు వెళ్ళింది.. ఆ తరవాత బ్యాంకాక్ వెళ్ళింది. హిందీ సినిమాలతో చాలా బిజీగా వుంది. అయినా 'క్యాష్' వంటి రెండు ప్రోగ్రామ్స్ కు వచ్చింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చింది. తను ఏదో బిజీగా ఉండటం వల్లనే రాలేదు" అని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ మీడియాలో ఏదైనా భూతద్దంలో చూస్తారు. వాళ్ళకి ఏదొక ఐటమ్ కావాలి. ఏ గాసిప్ దొరికినా దాన్ని వాడేస్తారు అని అన్నారు.

"ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకొని అందరినీ కోఆర్డినేట్ చేసుకోవడం చాలా టఫ్ జాబ్. 'ఇంతమంది ఉన్నారు కదా.. మనం వెళ్లకపోతే ఏమవుతుందిలే' అనుకుంటారు. హీరోలకు ఎలాగూ తప్పదు. కాకపోతే హీరోయిన్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అలాంటి గ్యాప్ వస్తుంది. అవన్నీ చిన్న చిన్నవే అని.. మైనర్ థింగ్స్" అని దిల్ రాజు పేర్కొన్నారు.

అయితే తమన్నా ప్రమోషన్స్ కు రాకపోవడానికి అనిల్ - దిల్ రాజు చెప్పిన వివరణలు ప్రేక్షకులను మరింత గందరగోళానికి గురిచేశాయి. నిజంగానే స్టార్ హీరోయిన్ కు 'ఎఫ్ 3' టీమ్ కు మధ్య విభేదాలు ఉన్నాయేమో అని సందేహిస్తున్నారు. అయితే తమన్నా ట్విట్టర్ వేదికగా 'మిస్ బి అండ్ ఆమె బ్రో' అంటూ సినిమాలో తన పాత్రకు సంబంధించిన రెండు గెటప్స్ తో ఓ వీడియోని షేర్ చేసింది.