Begin typing your search above and press return to search.

అదే నిజ‌మైతే బ‌న్నీ ఫ్యాన్స్ కి పండ‌గే!

By:  Tupaki Desk   |   22 Jun 2022 12:30 PM GMT
అదే నిజ‌మైతే బ‌న్నీ ఫ్యాన్స్ కి పండ‌గే!
X
టాలీవుడ్ లో ఇప్పుడు ఏ స్టార్ హీరోని క‌దిలించినా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట పాన్ ఇండియా .. పాన్ ఇండియా.. స్టార్ హీరోల‌తో పాటు మినిమ‌మ్ గ్యారెంటీ హీరోలు కూడా పాన్ ఇండియా మూవీస్ తో ఆక‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే నిఖిల్ లాంటి హీరోలు రెండు పాన్ ఇండియా సినిమాలని రెడీ చేసి రిలీజ్ కి సిద్ధ‌మైపోయారు. ఈ రేసులో ప్ర‌భాస్ త‌రువాత బ‌న్నీ దూసుకుపోతున్నాడు. 'పుష్ప‌'కు సీక్వెల్ చేయ‌బోతున్న అల్లు అర్జున్ ఈ విష‌యంలో టెర్రిఫిక్ ప్లాన్ తో రెడీ అయిపోతున్నాడు. అల్లు అర్జున్ - సుకుమార్ ల క‌ల‌యిలో వ‌చ్చిన 'పుష్ప‌' పాన్ ఇండియా వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించింది.

బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి హాట్ టాపిక్ గా నిలిచింది. బాలీవుడ్ లో అయితే ఈ మూవీ రాబ‌ట్టిన వ‌సూళ్లు అక్క‌డి వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేశాయి. దీంతో ఈ మూవీకి సీక్వెల్ గా త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ల‌నున్నప్రాజెక్ట్ పై స‌ర్వ‌త్రా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌ని దృష్టిలో పెట్టుకుని క‌థ‌లో ద‌ర్శ‌కుడు చాలా మార్పులు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఇటీవ‌ల విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించిన 'కేజీఎఫ్‌2' విజ‌యాన్ని దృష్ట‌లో పెట్టుకుని పుష్ప సీక్వెల్ లో భారీ మార్పులు చేశార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

తాజాగా 'పుష్ప 2' కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఫిల్మ్ స‌ర్కిల్స్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. 'కేజీఎఫ్ 2' రిజ‌ల్ట్ ని గ‌మ‌నించిన త‌రువాత సుకుమార్ పుష్ప సీక్వెల్ లో భారీ మార్నులు చేశారంటూ వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో తాజాగా పార్ట్ 3కి సంబంధించిన లీడ్ ని 'కేజీఎఫ్ 2' త‌ర‌హాలోనే 'పుష్ప -2' క్లైమాక్స్ లో హింట్ గా ఇవ్వ‌బోతున్నార‌ని చెబుతున్నారు.

ఈ వార్త ఇప్ప‌డు స్టార్ హీరో అల్లు అర్జున్ అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ కి గురిచేస్తోంది. రాఖీభాయ్ 'కేజీఎఫ్‌' త‌ర‌హాలో 'పుష్ప‌'ని కూడా మూడు పార్ట్ లుగా తెర‌పైకి తీసుకురావాల‌ని సుకుమార్ ఆలోచిస్తున్న తీరు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

క‌ల్ట్ మూవీగా ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న 'పుష్ప‌' కు పార్ట్ 3 ని కూడా చేయ‌బోతున్నారంటూ వ‌స్తున్న వార్త‌లు అభిమానుల‌తో పాటు ఫ్యాన్స్ ని స‌ర్ ప్రైజ్ చేస్తున్నాయి. అయితే ఇది నిజ‌మా.. లేక రూమ‌రా అన్న‌ది తెలియాల్సి వుంది. ఒక వేళ 'కేజీఎఫ్ 3' త‌ర‌హాలో 'పుష్ప 3' కూడా రానుంద‌న్న‌ది నిజ‌మైతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి పండ‌గే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. ఇదిలా వుంటే ప్ర‌స్తుతం 'పుష్ప 2' స్క్రిప్ట్ ని ద‌ర్శ‌కుడు ఫైన‌ల్ గా లాక్ చేశాడు.

పార్ట్ 1 ని మించి అత్యంత భారీ స్థాయిలో దాదాపు రూ. 400 కోట్ల భారీ బ‌డ్జెట్ తో సీక్వెల్ ని తెర పైకి తీసుకురాబోతున్నారు. రష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని జూలై నుంచి ప్రారంభించే అవ‌కాశాలున్నాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జోరుగా జ‌రుగుతున్నాయి. పార్ట్ 2 ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని ఫ్యాన్స్ చాలా ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.