Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరికి కరోనా సోకడంతో 'RRR' టీమ్ కలవర పడుతోందా..?

By:  Tupaki Desk   |   9 March 2021 1:09 PM GMT
ఆ ఇద్దరికి కరోనా సోకడంతో RRR టీమ్ కలవర పడుతోందా..?
X
బాలీవుడ్ లో మళ్ళీ కరోనా కలకలం మొదలైంది. స్టార్ హీరో రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డారు. అలానే ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత సంజయ్ లీలా భన్సాలీకి కూడా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ఐసోలేషన్ లో ఉన్న వీరిద్దరూ చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో తమతో కాంటాక్ట్ అయిన వారిని కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోమని కోరారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇద్దరు బాలీవుడ్ ప్రముఖులకు కరోనా సోకడంతో 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ లో టెన్షన్ మొదలైందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే రణబీర్ కపూర్ గర్ల్ ఫ్రెండ్ ఆలియా భట్ ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'గంగూబాయి కతియావాడి' సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలానే తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ కి తనతో సినిమా చేస్తున్న దర్శకుడికి కోవిడ్ రావడంతో ఆలీయా భట్ టెస్ట్ చేయించుకోవడంతో పాటు సెల్ఫ్ క్వారెంటైన్ లో ఉన్నారని తెలుస్తోంది. దీంతో 'గంగూబాయి' సినిమా షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఇదే క్రమంలో ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' షూటింగ్ కి బ్రేక్ పడుతుందేమో అని చిత్ర యూనిట్ కలవరపడుతోందట.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - అలియా భట్ లపై ఓ సాంగ్ షూట్ చేయడానికి ట్రిపుల్ ఆర్ టీమ్ గ్రాండ్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. రాజమౌళి ఈ వారాంతంలో పాట చిత్రీకరణకు ప్లాన్ చేస్తున్నారని.. అలియా మరికొన్ని రోజుల్లో హైదరాబాద్‌ కు రానుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అలియా క్వారెంటైన్ లో ఉండటంతో షూటింగ్ ప్లాన్స్ అన్నీ చేంజ్ చేయాల్సి వస్తుందేమో అని చిత్ర బృందం ఆలోచిస్తోందట. తారక్ - చరణ్ కలిసి నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో జక్కన్న దానికి తగ్గట్లే శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. అయితే ఇప్పుడు ఒకవేళ అలియా కారణంగా షూట్ కి బ్రేక్ పడితే మాత్రం అది ట్రిపుల్ ఆర్ టీమ్ కి తలనొప్పిగా మారే అవకాశం ఉందని చెప్పవచ్చు.