Begin typing your search above and press return to search.

'వి' తర్వాత నాని మరో మల్టీస్టారర్ చేయడానికి రెడీగా ఉన్నాడా...?

By:  Tupaki Desk   |   13 Sep 2020 11:10 AM GMT
వి తర్వాత నాని మరో మల్టీస్టారర్ చేయడానికి రెడీగా ఉన్నాడా...?
X
టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోస్ ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. 'ఆచార్య' సినిమాలో మెగాస్టార్ చిరంజీవి - రామ్‌ చరణ్‌ కలిసి నటించనున్నారు. ఈ క్రమంలో దగ్గుబాటి రానా - నేచురల్ స్టార్ నాని హీరోలుగా ఓ మల్టీస్టారర్ రూపొందనుందని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. రియల్ లైఫ్ లో స్నేహితులుగా ఉండే రానా - నాని లను ఒకే స్క్రీన్ పై చూపించడానికి సురేష్‌ ప్రొడక్షన్స్‌ సురేష్‌బాబు ప్లాన్ చేస్తున్నారట. దీని కోసం సురేష్ బాబు మంచి స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నారని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు.

నేచురల్ స్టార్ నాని కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇతర హీరోలతో కలిసి నటించడానికి ఎప్పుడూ వెనుకాడలేదు. 'అష్టాచమ్మా' 'రైడ్' 'ఎవడే సుబ్రహ్మణ్యం' 'నిన్ను కోరి' 'దేవదాస్' మొదలైన మల్టీస్టారర్ చిత్రాల్లో నటించాడు. ఇటీవల తన కెరీర్లో 25వ చిత్రంగా వచ్చిన 'వి' సినిమాలో సుధీర్ బాబుతో కలిసి నటించాడు. మరోవైపు రానా కూడా తెలుగు హిందీ తమిళ్ భాషల్లో పలు మల్టీస్టారర్ చిత్రాల్లో నటించాడు. ఈ క్రమంలో నాని - రానా లు కలిసి ఓ సినిమా చేయబోతున్నారని న్యూస్ వచ్చింది. ఇటీవల 'వి' సినిమాతో నాని కి నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో ఈ మల్టీస్టారర్ కి నాని ఓకే చెప్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం నాని మరియు రానా లు ఇద్దరూ చేతి నిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవేళ వీరిద్దరూ మల్టీస్టారర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చెప్పలేం.