Begin typing your search above and press return to search.

అఖిల్ ని క‌ర‌ణ్ చేతిలో పెడుతున్న నాగ్?

By:  Tupaki Desk   |   15 Sep 2022 9:30 AM GMT
అఖిల్ ని క‌ర‌ణ్ చేతిలో పెడుతున్న నాగ్?
X
బాలీవుడ్ కింగ్ పిన్.. ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ని ఎవ‌రు క‌లిసినా ఊహాగానాలు వేరే లెవ‌ల్ కి చేరుకుంటాయి. అత‌డు వ‌రుస‌గా డెబ్యూ తార‌ల్ని బాలీవుడ్ కి ప‌రిచ‌యం చేసిన వాడిగా అసాధార‌ణ రికార్డును క‌లిగి ఉన్నాడు. దాంతో పాటే ఇండ‌స్ట్రీలో భారీ పాన్ ఇండియా సినిమాల‌ను నిర్మిస్తూ.. ఇటు సౌత్ సినిమాల‌ను ఉత్త‌రాదిన ప్రోత్స‌హిస్తూ ఇక్క‌డి యువ‌హీరోల‌ను బాలీవుడ్ కి ప్ర‌మోట్ చేస్తూ బోలెడంత‌ ఎన్ క్యాష్ చేస్తున్న ట్యాలెంటెడ్ ప‌ర్స‌నాలిటీగాను గుర్తింపును పొందాడు. ఇక న‌ట‌వార‌సుల‌ను పెద్ద స్టార్ల‌ను చేయాలంటే క‌రణ్ ఒక చెయ్యేస్తే చాలు అనుకుంటున్నారు సౌత్ లో.

అయితే ఇలాంటి స‌మ‌యంలో కింగ్ నాగార్జున త‌న‌యుడు అఖిల్ తో క‌లిసి ముంబై విమానాశ్ర‌యంలో క‌నిపించ‌డం.. అటుపై నాగ్ ఏకంగా ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ ఆఫీస్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డంతో ర‌క‌ర‌కాల సందేహాలు అలుముకున్నాయి.

ఈరోజు నాగార్జున ధర్మ ప్రొడక్షన్స్ కార్యాలయంలో కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో ఇప్పుడే నాగ్ ముంబైలో ఎందుకు దిగార‌నే దానిపై అభిమానుల్లో విస్త్ర‌తంగా చర్చ మొదలైంది. క‌ర‌ణ్ నిర్మించిన బ్ర‌హ్మాస్త్ర‌లో నాగ్ న‌టించాడు. నాగ్ పాత్ర మొదటి భాగంలో ముగిసింది. కానీ ఇంకా అతను ముంబైలో కనిపించడం కొత్త ఊహాగానాలకు దారితీసింది. ఒక‌వేళ బ్ర‌హ్మాస్త్ర‌ సెకండ్ పార్ట్ లో భాగం కాబోతున్నాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. 'బ్రహ్మాస్త్ర'లో కింగ్ నాగార్జున ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. త‌న పాత్ర‌కు వ‌చ్చిన‌ రెస్పాన్స్ తో చాలా సంతోషంగా ఉన్నాడు. ఇక‌పోతే బ్ర‌హ్మాస్త్ర 2లో ఏదైనా కొత్త పాత్ర‌కు ఆస్కారం ఉందా? అది నాగ్ కి కాకుండా అఖిల్ కి క‌నెక్ట్ కాబోతోందా? అనే సందేహాల‌ను అక్కినేని ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాల్లో వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి అఖిల్ విష‌యంలో ఏదో కొత్త‌గా జ‌ర‌గ‌బోతోంద‌న్న అనుమానాలు రేకెత్తాయి.

మ‌రోవైపు కొంతకాలంగా చర్చల దశలో ఉన్న తన 100వ సినిమా గురించి నాగ్ కొత్త ప్లాన్ తో ఉన్నారా? అది పాన్ ఇండియన్ మూవీ కాబోతోందా? అన్న‌ది ఇప్పుడు డిబేట్ గా మారింది. ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా నాగార్జున దీనిపైనా స్పందించారు. ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్ట్ కోసం నలుగురు దర్శకులతో చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తానని చెప్పారు. తన 100వ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని సరైన సమయంలో ప్రాజెక్ట్ వివరాలను ప్రకటిస్తారని అన్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం మోహన్ రాజాతో చర్చలు జరుపుతున్నాడని టాక్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు నలుగురు దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు నాగ్ వెల్లడించాడు. నాగార్జున 100వ చిత్రాన్ని ఆయన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుంది. అక్టోబ‌ర్ 5న 'ది ఘోస్ట్' విడుద‌ల కానుంది. ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌కి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వ‌హించారు. నాగ్ భారీ విజ‌యంపై క‌న్నేశారు. అలాగ‌ని త‌న ప్ర‌యోగాత్మ‌క శైలిని మాత్రం విడిచిపెట్ట‌డం లేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.