Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ మేక‌ర్స్ క్రేజీ మ‌ల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారా?

By:  Tupaki Desk   |   12 July 2022 3:59 AM GMT
కేజీఎఫ్ మేక‌ర్స్ క్రేజీ మ‌ల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నారా?
X
కరోనా త‌రువాత దేశ వ్యాప్తంగా సినీ ప్ర‌పంచంలో విప్ల‌వాత్మ‌క మార్పులు మొద‌ల‌య్యాయి. సినిమా బ‌డ్జెట్ లు పెరిగిపోవ‌డ‌మే కాకుండా ఆ బ‌డ్జెట్ ల‌ని మించి మార్కెట్ కూడా భారీ స్థాయిలో విస్త‌రిస్తోంది. దీంతో స్టార్ హీరోలు సైతం ప్రయోగాలు చేయ‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. స్టార్ హీరోలు ముందుకు వ‌స్తుండ‌టంతో ద‌ర్శ‌కులు కూడా కొత్త త‌ర‌హా సినిమాల‌కు శ్రీ‌కారం చుడుతున్నారు. క్రేజీ స్టార్ల‌తో మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇదే ఫార్ములాతో రూపొందిన RRR, విక్ర‌మ్ వంటి సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్నాయి.

దీంతో ఇదే త‌ర‌హాలో క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ మూవీస్ కి ద‌ర్శ‌కులు, క్రేజీ ప్రొడ‌క్ష‌న్ హౌస్ లు శ్రీ‌కారం చుడుతున్నాయి. ఈ త‌ర‌హా సినిమాల‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మర‌థం ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌పై ప్ర‌త్యేక దృష్టిని పెడుతున్నారు. కేజీఎఫ్ సీరిస్ ల‌తో పాన్ ఇండియా వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించిన హోంబ‌లే ఫిలింస్ అధినేత విజ‌య్ కిర‌గందూర్ ఓభారీ మల్టీస్టార‌ర్ మూవీకి శ్రీ‌కారం చుడుతున్నారు. స‌రికొత్త నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో త‌మిళ‌, మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీల‌కు చెందిన ఇద్ద‌రు క్రేజీ హీరోలు క‌లిసి న‌టించ‌బోతున్నార‌ని తెలిసింది.

ఆ ఇద్ద‌రు క్రేజీ స్టార్స్ సూర్య‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌. ఊహించ‌ని కాంబినేష‌న్ లో అత్యంత ప్ర‌యోగాత్మ‌కంగా రూపొంద‌నున్న ఈ మూవీకి 'ఆకాశం నీ హ‌ద్దురా' ఫేమ్ సుధా కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ప్ర‌స్తుతం హోంబ‌లే ఫిలింస్ అధినేత విజ‌య్ కిర‌గందూర్ ... పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ 'స‌లార్‌'ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న మూవీ ఇది. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

ఈ మూవీలోని అత్యంత కీల‌కమైన పాత్ర‌లో మ‌ల‌యాళ క్రేజీ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ న‌టిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ తో పాటు హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు హోంబ‌లే ఫిలింస్‌. ఈ సినిమాల చిత్రీక‌ర‌ణ అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ లో వుండ‌గానే సూర్య‌, దుల్క‌ర్ స‌ల్మాన్ ల‌తో సుధా కొంగ‌ర తెర‌కెక్కించ‌నున్న క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ని కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నార‌ట. ఈ ప్రాజెక్ట్ ప్ర‌క‌టించి చాలా రోజులే అవుతున్నా ఇంత వ‌ర‌కు హీరోలు ఎవ‌ర‌న్న‌ది ప్ర‌క‌టించ‌లేదు. తాజాగా ఈ మూవీలో సూర్య‌, దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించనున్నార‌ని తెలిసింది.

'ఆకాశం నీ హ‌ద్దురా' సినిమాతో హీరో సూర్య‌కు సుధా కొంగ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించిన విష‌యం తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన న‌మ్మ‌కంతోనే మ‌రోసారి సుధా కొంగ‌ర‌తో మ‌ల్టీస్టార‌ర్ కి సూర్య గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. దుల్క‌ర్ కూడా స్టోరీ న‌చ్చ‌డంతో ఓకే చెప్పార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది.

త్వ‌ర‌లోనే అధికారికంగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివ‌రాల్ని మేక‌ర్స్ వెల్ల‌డించ‌నున్నార‌ట‌. ఇదిలా వుంటే హీరో సూర్య - బాల కాంబినేష‌న్ లో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ టైటిల్ ప్రీ లుక్ ని సోమ‌వారం విడుద‌ల చేశారు. 'వ‌నంగాన్‌' అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాని తెలుగులో 'అచ‌లుడు'గా రిలీజ్ చేయ‌బోతున్నారు.