Begin typing your search above and press return to search.

తెలుగు ప్రాజెక్ట్ కి ఇళ‌య‌ద‌ళ‌ప‌తి షాకిస్తున్నాడా?

By:  Tupaki Desk   |   30 Jan 2022 2:30 AM GMT
తెలుగు ప్రాజెక్ట్ కి ఇళ‌య‌ద‌ళ‌ప‌తి షాకిస్తున్నాడా?
X
మ‌న వాళ్లు బాలీవుడ్ కి ద‌డ పుట్టించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తూ పాన్ ఇండియా మూవీస్ ప్లాన్ చేస్తుంటే కోలీవుడ్ హీరోలు మాత్రం తెలుగు మార్కెట్ పై క‌న్నేయ‌డం ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ధ‌నుష్ తెలుగులో `సార్‌` మూవీని మొద‌లుపెట్టేశాడు. వెంకీ అట్లూరి తెర‌కెక్కిస్తున్నఈ మూవీని సితార ఎంట‌ర్ టైన్‌మెంట్స్‌.. ఫార్చూర్ సినిమాస్ బ్యాన‌ర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ మూవీ ఏక కాలంలో రూపొందుతోంది.

ఇదిలా వుంటే ఈ హీరోతో పాటు ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ కూడా త్వ‌ర‌లో తెలుగు సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. వంశీ పైడి ప‌ల్లి డైరెక్ట్ చేయ‌నున్న‌ఈ భారీ చిత్రాన్ని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు నిర్మించ‌బోతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి రాబోతున్న ఈ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన అప్ డేట్ తాజాగా బ‌య‌టికి వ‌చ్చేసి వైర‌ల్ గా మారింది.

తెలుగులో విజ‌య్ చిత్రాల‌కు భారీ డిమాండ్ వుండ‌టంతో విజ‌య్‌తో స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయ‌డానికి రెడీ అయిపోయారు. అయితే ఈ క్రేజీ చిత్రానికి హీరో విజ‌య్ భారీ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తూ షాకిచ్చేస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్రీవియ‌స్ మూవీ `మాస్ట‌ర్‌` కు కూడా విజ‌య్ భారీ స్థాయిలో రెమ్యున‌రేష‌న్ ని డిమాండ్ చేశార‌ని, అదే స్థాయిలో వంశీ పైడిప‌ల్లి చిత్రానికి కూడా డిమాండ్ చేస్తున్నార‌ని చెబుతున్నారు.

అంతే కాకుండా ఈ మూవీ ద్విభాషా చిత్రం కావ‌డంతో ఏక‌కాలంలో రెండు భాష‌ల్లో రూపొంద‌నున్న సినిమా కావ‌డంతో ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి విజ‌య్ భారీగానే డిమాండ్ చేస్తున్నార‌ని, అది ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింద‌ని తెలుస్తోంది. విజ‌య్ చిత్రాల‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ మార్కెట్, ప్రీరిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జ‌రుగుతున్న నేప‌థ్యంలో దిల్ రాజు కూడా విజ‌య్ కున్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుని త‌ను అడిగిన మొత్తం ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డిన‌ట్టుగా కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం విజ‌య్ `బీస్ట్‌` చిత్రంలో న‌టిస్తున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై క‌ళానిధి మార‌న్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ భారీ చిత్రంలో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తోంది. బ్లాక్ కామెడీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 14న వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతోంది.