Begin typing your search above and press return to search.

త్రిశంకు స్వర్గంలో ఇండస్ట్రీ హిట్ దర్శకుడు

By:  Tupaki Desk   |   17 April 2019 10:56 AM GMT
త్రిశంకు స్వర్గంలో ఇండస్ట్రీ హిట్ దర్శకుడు
X
ఓ మాములు లవ్ స్టోరీ ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేయడం చాలా అరుదు. అది సాధ్యం చేసి చూపించాడు దర్శకుడు పరశురామ్.. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న జంటగా అతను తీసిన గీత గోవిందం 60 కోట్లకు పైగా షేర్ రాబట్టి ట్రేడ్ సైతం ఊహించని లాభాలను కళ్ళజూసేలా చేసింది. ఇది జరిగి 9 నెలలు దాటేసింది. ఇప్పటిదాకా పరశురామ్ ఇంకెవరికి కమిట్ కాలేదు.

నెక్స్ట్ సినిమా కూడా తమ కోసమే లాక్ చేసుకున్న గీత ఆర్ట్స్ సంస్థ అతనికి హీరోను ఇవ్వడంలో డిలే చేస్తూ త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది. తనకు బ్రేక్ ఇచ్చిన సంస్థ కాబట్టి పరశురామ్ సైతం మాటకు కట్టుబడి తన దగ్గర సిద్ధంగా ఉన్న స్క్రిప్ట్స్ తో ఎదురు చూస్తూనే ఉన్నాడు. నిజానికి ఒకదశలో త్రివిక్రమ్ కంటే ముందు అల్లు అర్జున్ తో పరశురామ్ చేస్తాడనే టాక్ వచ్చింది. నా పేరు సూర్య దెబ్బకు ఒక్క శాతం రిస్క్ తీసుకునేందుకు రెడీగా లేని బన్నీ అనుభవానికే ఓటు వేశాడు. దీంతో ఛాన్స్ మిస్ అయ్యింది

తర్వాత కొద్ది రోజులు సాయి ధరం తేజ్ పేరు వినిపించింది. పక్కా అనేలా లీక్స్ వదిలారు. కట్ చేస్తే అతను చిత్రలహరికి ఓకే చెప్పేశాడు. ఇప్పుడేమో మహేష్ బాబు కోసం పరశురామ్ కథ రాస్తున్నాడంటూ కొత్త ప్రచారం మొదలైంది. ఇంకా అనిల్ రావిపూడి నెరేషనే మహేష్ పూర్తిగా వినలేదు. మహర్షి విడుదల కాగానే అది ఫైనల్ చేసి తక్కువ గ్యాప్ లో దాని షూటింగ్ కు వెళ్ళిపోతాడు.

ఇప్పుడు పరశురామ్ రెడీ చేస్తున్న కథ ప్రిన్స్ ఆల్రెడీ ఓకే చేసిన లైనా లేక నచ్చితే చేస్తాను అనే కమిట్ మెంటా అనే క్లారిటీ రాలేదట. మరోవైపు అందరూ హీరోలు తమ తమ ప్రాజెక్ట్స్ తో యమా బిజీగా ఉన్నారు. అయినా అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ఇన్నేసి నెలలు ఇలా ఎదురు చూడటం అంటే వ్యక్తిగతంగా ఇబ్బంది కలిగించేదే అయినా తప్పదు మరి. పరిశ్రమ తీరే అంత