Begin typing your search above and press return to search.

ధనుశ్ జోడీగా 'ఉప్పెన' పిల్లనా? 'శ్రీకారం' బ్యూటీనా?

By:  Tupaki Desk   |   11 April 2021 1:30 PM GMT
ధనుశ్ జోడీగా ఉప్పెన పిల్లనా? శ్రీకారం బ్యూటీనా?
X
టాలీవుడ్లో ధనుశ్ కి మంచి క్రేజ్ ఉంది. ఇంతకుముందు తాను చేసిన సినిమాకి .. ఇప్పుడు తాను చేయనున్న సినిమాకి మధ్య తేడా ఏమిటి? ఎంత?. కొత్తగా ప్రేక్షకులకు చూపించేదేమిటి? దానిని వాళ్లు ఎంతవరకూ రిసీవ్ చేసుకుంటారు? ఇలా ఒక పద్ధతిగా .. గోడకట్టినట్టుగా ధనుశ్ తన సినిమాలను ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన నుంచి విభిన్నమైన సినిమాలు వస్తూ ఉంటాయి. విజయాలను అందుకుంటూ ఉంటాయి. ఆయన తాజా చిత్రంగా థియేటర్లలో దిగిపోయిన 'కర్ణన్' .. రికార్డుస్థాయిలో దూసుకుపోతోంది.

ఈ సినిమా తరువాత ధనుశ్ అభిమానుల ముందుకు వెళ్లడానికి రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇక ధనుశ్ తదుపరి ప్రాజెక్టును సెట్ చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు. ఇంతవరకూ తాను టచ్ చేయని పాయింట్ తో ఆయన ఒక కథను ఎంచుకున్నాడని చెబుతున్నారు. బాలాజీ మోహన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు సమాచారం. గతంలో ఈ ఇద్దరూ కలిసి సినిమాలు చేశారు .. మరోసారి ఈ కాంబినేషన్ సెట్ కానుందన్న మాట.

అయితే అసలు విషయమేమిటంటే ఈ సినిమాలో కథనాయికగా కృతి శెట్టినిగానీ, ప్రియాంక అరుళ్ మోహన్ ను గాని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఈ మధ్య కాలంలో కథానాయికలుగా పరిచయమైన వాళ్లలో నటనపరంగా .. గ్లామర్ పరంగా ఈ ఇద్దరూ మంచి మార్కులు కొట్టేశారు. ప్రియాంక అరుళ్ మోహన్ ఆల్రెడీ తమిళంలో శివకార్తికేయన్ .. సూర్య సినిమాల్లో అవకాశాలు పట్టేసింది. కుందనపు బొమ్మలాంటి కృతి శెట్టి అందాలు, తెలుగు తెరకే పరిమితమయ్యాయి. అందువలన ధనుశ్ తొలి ప్రాధాన్యతను కృతి శెట్టికి ఇవ్వొచ్చని అనుకుంటున్నారు. ధనుశ్ జోడీగా కోలీవుడ్ కి పరిచయం అంటే కృతి శెట్టి కాదంటుందా ఏంటి?