Begin typing your search above and press return to search.

బోయ‌పాటి మీద గుర్రుగా ఉన్న బాల‌య్య ఫ్యాన్స్..?

By:  Tupaki Desk   |   14 April 2021 7:31 AM GMT
బోయ‌పాటి మీద గుర్రుగా ఉన్న బాల‌య్య ఫ్యాన్స్..?
X
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రానికి ''అఖండ'' అనే పవర్ ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. ఉగాది సందర్భంగా ఆ సినిమా పేరుని ప్రకటించడంతోపాటు టీజర్‌ ని కూడా విడుదల చేశారు. టీజర్ లో ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా బాలయ్య 'అఘోరా' గెటప్ లో కనిపించి సర్ప్రైజ్ చేశాడు. ‘కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’ అంటూ బాలయ్య చెప్పే శక్తివంతమైన డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 'అఖండ' టీజర్ 8 మిలియన్లకు పైగా వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. బాలయ్యని కొత్త అవతారంలో చూపించిన బోయపాటిని మెచ్చుకుంటున్నప్పటికి.. టైటిల్ విషయంలో మాత్రం నందమూరి ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది.

'అఖండ' టీజ‌ర్ వరకు నంద‌మూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుండగా.. టైటిల్ విష‌యంలోనే చాలా డిజప్పాయింట్ అయ్యారని తెలుస్తోంది. ఎందుకో 'అఖండ' అనే టైటిల్ బాల‌య్య ఫ్యాన్స్ కు పెద్ద‌గా ఎక్క‌డంలేద‌ట‌. దీనికి బ‌దులు మొన్నటి వరకు ప్రచారంలో ఉన్న 'మోనార్క్' టైటిల్ నే ఖరారు చేస్తే బాగుండేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్న‌ట్లుగా ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఏదేమైనా బాలయ్య - బోయపాటి కాంబినేషన్‌ లో వస్తోన్న ఈ మూడో సినిమాపై భారీగా అంచనాలున్నాయి. 'సింహా' 'లెజెండ్' సినిమాల తర్వాత వస్తున్న ఈ చిత్రాన్ని అభిమానుల అంచనాకు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ''అఖండ'' చిత్రాన్ని మే 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో బాలయ్యకు జోడీగా ప్రగ్యా జైస్వాల్‌ - పూర్ణ నటిస్తున్నారు. మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.