Begin typing your search above and press return to search.

మరో సెలబ్రిటీ జంట విడాకులు తీసుకోబోతున్నారా..?

By:  Tupaki Desk   |   5 Feb 2022 3:30 AM GMT
మరో సెలబ్రిటీ జంట విడాకులు తీసుకోబోతున్నారా..?
X
ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో అనేక జంటలు తమ వైవాహిక జీవితాలకు గుడ్ బై చెబుతూ డివోర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విడాకుల పర్వం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ - కోలీవుడ్ వరకు కొనసాగుతోంది. అమీర్ ఖాన్ - కిరణ్ రావ్ జంట తమ 15 ఏళ్ల బంధానికి స్వస్తి పలికారు. స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య - సమంత తమ నాలుగేళ్ళ వివాహ బంధాన్ని బ్రేక్ చేసుకుంటున్నట్లు గతేడాది అక్టోబర్ లో ప్రకటించారు.

కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ డి.ఇమ్మాన్ తన భార్య మోనికా రిచర్డ్ తో విడిపోయినట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 44 ఏళ్ల వయసులో మాజీ విశ్వ సుందరి సుష్మితా సేన్.. 28 ఏళ్ల యువ మోడల్‌ రోహమన్‌ షాల్‌ తో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఇకపై తామిద్దరం కలసి ఉండబోమని.. బ్రేక్ అప్ చెప్పుకుంటున్నామని ఆ మధ్య ప్రకటించారు.

కోలీవుడ్ సెలబ్రిటీ జంట ధనుష్ - ఐశ్వర్య దంపతులు తమ 18 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటన రిలీజ్ చేసి అందరినీ షాక్ కు గురి చేశారు. అలానే టాలీవుడ్ లో పెద్ద ఫ్యామిలీకి చెందిన అమ్మాయి హీరో అయిన తన భర్తకు విడాకులు ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఇంతవరకు దీనిపై అధికారిక ప్రకటన లేదు. అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా విడిపోతున్నారంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా జంట విడిపోనుందని గతంలో వార్తలు ప్రచారంలోకి రాగా.. సెలబ్రిటీ కపుల్ వాటిని ఖండించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఇదే వార్త ప్రచారంలోకి వచ్చింది. దీనికి కారణం బాలీవుడ్ జంట మధ్య ఆస్తుల పంపకాలు జరగడమే అని బాలీవుడ్ మీడియా చెబుతోంది.

శిల్పాశెట్టి - రాజ్ కుంద్రా జోడీ గతేడాది వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ కకాబడిన రాజ్ కుంద్రా.. ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నారు. అయితే ఇటీవల రాజ్ కుంద్రా కోట్ల రూపాయల విలువైన ఆస్తులను శిల్పాశెట్టి పేరుపై బదలాయించారని కథనాలు వస్తున్నాయి. అంతేకాదు కేవలం విడిపోయే ఉద్దేశంతోనే భార్యాభర్తల మధ్య ఇలా ఆస్తుల బదలాయింపు ప్రక్రియ జరుగుతోందని బాలీవుడ్ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. త్వరలో వీరిద్దరూ విడాకుల గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

ఇకపోతే శిల్పాశెట్టి తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అక్కినేని నాగార్జున సరసన 'ఆజాద్' - వెంకటేష్ తో 'సాహస వీరుడు సాగర కన్య' - బాలకృష్ణతో కలిసి 'భలే వాడివి బాసూ' - మోహన్ బాబుకు జోడీగా 'వీడెవడండి బాబూ' వంటి సినిమాల్లో శిల్పాశెట్టి నటించింది. ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో.. శిల్పాశెట్టి తెలుగు సినిమాలకు దూరమయ్యారు.