Begin typing your search above and press return to search.

దూసుకొస్తున్న 'స్కైలాబ్'.. ఆసక్తికరంగా క్యారక్టర్ పోస్టర్స్..!

By:  Tupaki Desk   |   28 Oct 2021 1:47 PM GMT
దూసుకొస్తున్న స్కైలాబ్.. ఆసక్తికరంగా క్యారక్టర్ పోస్టర్స్..!
X
టాలెంటెడ్ హీరో సత్యదేవ్ - నిత్యామీనన్ - రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ''స్కైలాబ్''. 1979లో జరిగిన స్కైలాబ్ సంఘటన ఆధారంగా అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా మూవీలోని లీడ్ యాక్టర్స్ క్యారక్టర్ పోస్టర్స్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.

'స్కైల్యాబ్' చిత్రంలో ఆనంద్ పాత్రలో సత్యదేవ్.. గౌరీ అనే యువతి పాత్రలో నిత్యా మీనన్ కనిపించనున్నారు. సుబేధార్ రామారావు రోల్ ను రాహుల్ రామకృష్ణ పోషించారు. ముగ్గురి లుక్స్ డిఫరెంట్ గా ఆకట్టుకునేలా ఉన్నాయి. వీరి గెటప్స్ చూస్తుంటే ఇదొక పీరియాడికల్ ఎంటర్టైనర్ అని తెలుస్తుంది.

కథ విషయానికొస్తే.. అమెరికా స్పేస్ స్టేషన్ నాసా ప్రయోగించిన స్కైలాబ్ భూమిపై పడుతుందని.. మొత్తం ప్రపంచం నాశనమైపోతుందని అపట్లో వార్తలు వచ్చాయి. ఏం జరగబోతుందో అని అందరూ ఆ సమయంలో తెగ చర్చలు జరిపారు. అలాంటి టైం లో కరీంనగర్ జిల్లా బండ లింగపల్లి గ్రామానికి చెందిన గౌరి - ఆనంద్ - సుబేదార్ రామారావుల జీవితాల్లో స్కైలాబ్ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ చిత్రంలో వినోదాత్మకంగా చూపించబోతున్నారు.

'స్కైలాబ్' చిత్రానికి విశ్వక్ కందెరావ్ దర్శకత్వం వహిస్తున్నారు. రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫీచర్స్ - నిత్యామీనన్ కంపెనీ బ్యానర్స్ పై పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'స్కైలాబ్' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 1వ తేదీన ట్రైలర్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. విభిన్నమైన కథ కథనాలతో రాబోతున్న ఈ సినిమా సత్యదేవ్ - నిత్యా మీనన్ లకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.