Begin typing your search above and press return to search.

ప్రాణాలతో ఉన్నా ఆమె ‘‘ఆ’’ షాక్ లోనే ఉంది

By:  Tupaki Desk   |   29 Feb 2016 4:45 PM GMT
ప్రాణాలతో ఉన్నా ఆమె ‘‘ఆ’’ షాక్ లోనే ఉంది
X
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ‘‘అన్న హత్యాకాండ’’ ఉదంతంలో ప్రాణాలతో బయటపడిన ఆ రాక్షసుడి సోదరి స్పృహలోకి వచ్చింది. తీవ్ర షాక్ లో ఉన్న ఆమె.. ‘‘అన్న అందరినీ చంపేశాడు’’ అన్న మాటను పదే పదే చెబుతోంది. మహారాష్ట్రలోని థానేలో సొంత కుటుంబ సభ్యుల్ని కత్తిలో గొంతుల్ని కోసేసి 14 మంది మరణాలకు కారణమైన ఉదంతం గురించి..రాక్షసుడి సోదరి సుబియా పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.

తీవ్రమైన షాక్ లో ఉన్న ఆమె.. తన అన్న అందరిని చంపేస్తున్నాడన్న మాటనే పదే పదే చెబుతోంది. ఇప్పటికి ఆమెకు.. జరిగిన విషయాల్ని చెప్పటం లేదు.ఆమె కుటుంబంలో ఎవరూ మిగల్లేదన్న వాస్తవాన్ని దాచి పెట్టారు. తన ఆరు నెలల కుమార్తె గురించి పదే పదే అడుగుతున్న ఆమె మాటల్ని విన్న వారంతా తీవ్ర ఆవేదనకు గురి అవుతున్నారు.

తోడబుట్టిన అన్న అందరిని అత్యంత కిరాతకంగా చంపేశాడన్న విషయాన్ని ఆమెకు తెలీకుండా చికిత్స చేస్తున్నారు. తన సోదరుడితో తమకు ఎలాంటి ఆస్తి తగాదాలు లేవని చెబుతున్న ఆమె.. తనను చంపేందుకు తన అన్న ప్రయత్నించిన సమయంలో తాను స్పృహలోకి వచ్చి.. అతడి బారి నుంచి తప్పించుకొని వేరే గదిలోకి వెళ్లి గడియ పెట్టుకున్నట్లుగా సుబియా చెబుతోంది.