Begin typing your search above and press return to search.

భారత రాజకీయాలే టార్గెట్ గా ‘భారతీయుడు2’

By:  Tupaki Desk   |   24 May 2018 5:13 AM GMT
భారత రాజకీయాలే టార్గెట్ గా ‘భారతీయుడు2’
X
పద్మ శ్రీ కమల్ హాసన్ ప్రస్తుతం సినిమాలకు దూరం జరిగారు.. ఈ మధ్యే కమల్ తమిళనాడు రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.. ‘మక్కల్ నీది మయిమ్’ అనే కొత్త పార్టీని స్థాపించి క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అంతేకాదు.. పార్టీ పెట్టగానే రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు , రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ప్రస్తుతం తన ఫోకస్ ను కమల్ హాసన్ మళ్లీ సినిమాలవైపు మళ్లించినట్టు తెలిసింది. త్వరలోనే దిగ్గజ దర్శకుడు శంకర్ తో ‘భారతీయుడు-2’ సినిమాను తీసేందుకు రెడీ అవుతున్నట్టు తెలిసింది. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో పట్టాలెక్కించాలని.. భారతీయుడు1 సినిమాకు సీక్వెల్ గా తీయాలని శంకర్ తో చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. దేశంలో ఉన్న అంతులేని అవినీతిని ఇందులో చూపించి పరిష్కారమయ్యేలా కథ ను రూపొందించాలని దర్శకుడిని కమల్ కోరినట్టు తెలిసింది.

భారతీయుడు2 మూవీలో దేశంలోని తాజా రాజకీయ వ్యవస్థ గురించి వివరిస్తూనే.. అదే సమయంలో సామాన్యులు రాజకీయాల్లోకి వచ్చేలా మెసేజ్ ఇవ్వాలని కమల్ డిసైడ్ అయినట్టు తెలిసింది. ఈరోజుల్లో దేశంలో చాలా వివాదాలు వస్తున్నాయని.. వాటన్నింటిపై మేలుకొలిపే తన తాజా చిత్రం ఉండబోతుందని కమల్ తాజాగా జరిపిన విలేకరుల సమావేశంలో సూచనప్రాయం గా చెప్పారు.

ఈ భారతీయుడు2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుందని.. దీన్ని 2019లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు కమల్ తెలిపారు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్2తో కమల్ హాసన్ బిజీ అయ్యారు. జూన్ నుంచి ఈ షో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారు. ఆ తర్వాతే భారతీయుడు 2 మూవీ పట్టాలెక్కనుంది.