Begin typing your search above and press return to search.

బాహుబలి నిర్మాతలపై ఐటీ దాడులు

By:  Tupaki Desk   |   11 Nov 2016 2:15 PM GMT
బాహుబలి నిర్మాతలపై ఐటీ దాడులు
X
3-4 ఏళ్లుగా టాలీవుడ్ లో విపరీతంగా సంచలనం సృష్టించిన బాహుబలికి సంబంధించి.. ఇప్పటివరకూ బోలెడన్ని పాజిటివ్ న్యూస్ వినిపించాయి. ఇప్పుడు బాహుబలి2 గురించి ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తుంటే.. ఇప్పుడు ఐటీ దాడుల గురించి న్యూస్ వచ్చింది.

ఆర్కా మీడియా ఆఫీసులపై ఆదాయపు పన్ను అధికారులు దాడి చేయడం సంచనలం అయింది. ప్రసాద్ దేవినేని.. శోభు యార్లగడ్డలకు చెందిన ఆఫీసులు అన్నిటిలోనూ సడెన్ గా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 2017 ఏప్రిల్ 28న విడుదల కానున్న బాహుబలి2 కి ఇప్పటికే బిజినెస్ ను ప్రారంభించడంతో.. అకౌంటింగ్ లోపాలపై తనిఖీలు నిర్వహించారు. బాహుబలి.. ది కంక్లూజన్ ను భారీ రేట్లకు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. నైజాం రైట్స్ ను దక్కించుకోవడానికి ఏకంగా 50 కోట్ల మొత్తాన్ని చెల్లించారనే న్యూస్ ఉంది.

ఆంధ్ర.. సీడెడ్ నుంచి కూడా ఇంతకంటె పెద్ద మొత్తానికే రైట్స్ విక్రయమయ్యాయి. అయితే.. ఈ రేట్లకు అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నంత మాత్రాన.. మొత్తం అమౌంట్ అంతా ఇచ్చే ఛాన్స్ ఉండదు. కొంత మొత్తాన్ని టోకెన్ అమౌంట్ గా చెల్లిస్తారంతే. అయితే.. అకౌంటింగ్ మెయింటెనెన్స్.. వచ్చిన వరకూ అమౌంట్ ను లెక్కల్లో చూపించారా లేదా అనే అంశాలను పరిశీలించేందుకే ఇలా సోదాలు చేపట్టారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/