Begin typing your search above and press return to search.

నేనెంతో అభిమానించే ఆ వ్యక్తితో హోటల్ రూంలో..!

By:  Tupaki Desk   |   3 May 2022 12:30 AM GMT
నేనెంతో అభిమానించే ఆ వ్యక్తితో హోటల్ రూంలో..!
X
2021 మిస్ యూనివర్శ్‌ గా నిలిచిన హర్నాజ్ సందూకి డిజైనర్ గా వ్యవహరించిన సైషా షిండే ఈమద్య కాలంలో బాలీవుడ్‌ లో బాగా ఫేమస్ అయ్యింది. ట్రాన్స్ జెండర్‌ అయిన సైషా షిండే రెగ్యులర్‌ గా వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్‌ ప్రముఖ సెలబ్రెటీగా.. స్టార్స్ కి డిజైనర్‌ గా కొనసాగుతున్న సైషా తాజాగా కంగనా రనౌత్‌ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో లాకప్‌ లో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.

కంగనా రనౌత్‌ టాక్ షో విషయంలో పలు వివాదాలు.. విమర్శలు వస్తున్నాయి. సభ్యసమాజం ను తప్పుద్రోవ పట్టించే విధంగా ఈ టాక్ షో లో సెలబ్రెటీలు మాట్లాడుతున్నారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మరోసారి వివాదాస్పద సెలబ్రెటీని షో కు తీసుకు రావడం ద్వారా కంగనా రనౌత్‌ షో గురించి మరింతగా మీడియాలో చర్చ జరుగుతోంది.

వరుసగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న సైషా షిండే ఎంట్రీతో మరింతగా వార్తల్లో నిలిచింది. తాజాగా స్ట్రీమింగ్‌ అయిన లాకప్‌ ఎపిసోడ్‌ లో సైషా షిండే వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తన జీవితంలో ఎదుర్కొన్న ఒడి దొడుకుల గురించి.. ప్రస్తుతం తన ఇమేజ్ గురించి సైషా ఎంతో మందికి ఆదర్శణీయంగా నిలిచేలా మాట్లాడటం జరిగింది.

ఇంకా సైషా మాట్లాడుతూ.. ఈ విషయాన్ని నేను ఇప్పటి వరకు బయట ఎప్పుడు చెప్పలేదు. చాలా పెద్ద రహస్యం. అది ఏంటీ అంటే నాకు ఎంతో ఇష్టమైన ఒక ఇండియన్‌ డిజైనర్‌ ఒక రోజు నన్ను హోటల్‌ కు పిలిచారు.

తన గదిలోకి ఆయన తీసుకు వెళ్లారు. అప్పుడు మేమిద్దరం శారీరకంగా కూడా కలిశాం. అప్పటికే అతడు ఏడు.. ఎనిమిది మంది అబ్బాయిలతో శారీరక వాంచ తీర్చుకున్నాడంటూ చెప్పుకొచ్చింది.

ఆమె చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు బాలీవుడ్‌ మీడియాతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఆ ప్రముఖ డిజైనర్‌ అంటూ ఆరా తీయడం మొదలు పెడుతున్నారు. సైషా కు అంత ఇష్టమైన ఆ డిజైనర్ ఎవరు అయ్యి ఉంటాడు అంటూ బాలీవుడ్‌ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. కంగనా రనౌత్‌ లాకప్ షో సైషా వ్యాఖ్యలతో మరోసారి వైరల్‌ అయ్యింది.