Begin typing your search above and press return to search.

ఆ అవార్డుల కంపెనీ షాక్ తినేసిందంతే

By:  Tupaki Desk   |   2 April 2017 5:30 PM GMT
ఆ అవార్డుల కంపెనీ షాక్ తినేసిందంతే
X
గత ఏడాది ఈ అవార్డుల కంపెనీ వారు కొత్తగా సౌత్ ఇండియాపై ఫోకస్ పెట్టారు. బాలీవుడ్ లో అయితే అవార్డులు అంటే చాలు.. కేవలం గిఫ్ట్ హ్యాంపర్ పంపితేనే చాలామంది హీరోలు హీరోయిన్లు వచ్చేస్తారు. కాని టాలీవుడ్ అండ్ డౌన్ సౌత్ పనితీరు పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఈ కొత్త అవార్డుల కంపెనీకి రెండో సంవత్సరం మన యాక్టర్లు అందరూ షాకిచ్చేశారు.

నిజానికి మొదటి సంవత్సరం ఒక మెగాస్టార్ ను సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో.. ఈ అవార్డుల కార్యక్రమం చాలా ఘనంగా సాగింది. కాని ఈ సంవత్సరం మాత్రం.. కేవలం అవార్డును గెలుచుకున్న స్టార్లు తప్పిస్తే వేరెవ్వరూ రాలేదు. కొందరు స్టార్లు షూటింగులో బిజీగా ఉంటే.. కొందరు హైదరాబాదులోనే రిలాక్స్ అవుతూ ఉన్నారు. స్టార్ హీరోయిన్లు కూడా అనుకున్నంతమంది అక్కడ కనిపించలేదు. అసలు ఏమాత్రం జోష్‌ లేకుండా ఈ వేడుక సాగిందంటే చూసుకోండి. ఇదేంటి బాబోయ్.. సౌత్ లో కేవలం అవార్డు ఇస్తేనే వస్తారా? అంటూ నిర్వాహకులు తలపట్టుకున్నారట.

ఇక్కడే కాదులే.. నంది అవార్డులు వంటి కార్యక్రమాలకు కూడా మనోళ్లు కేవలం ట్రోఫీలు వచ్చినోళ్లే వస్తారు. అది మన ఆనవాయితీ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/