Begin typing your search above and press return to search.

ప్రభాస్ నో అంటే.. నా సినిమానే లేదు అంటున్న డైరెక్టర్

By:  Tupaki Desk   |   6 Jan 2021 11:30 PM GMT
ప్రభాస్ నో అంటే.. నా సినిమానే లేదు అంటున్న డైరెక్టర్
X
డార్లింగ్ ప్రభాస్.. వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. సాహో లాంటి భారీ సినిమా రెడీ అవుతున్న సినిమా కాబట్టి అంచనాలు ఓ రేంజిలో ఏర్పడ్డాయి. పీరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న రాధేశ్యామ్ ఈ ఏడాది విడుదల అవుతుందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాలో నటించనున్నాడు ప్రభాస్. ఫుల్లీ యాక్షన్ ప్యాకెడ్ సినిమాగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రభాస్.. సలార్ గెటప్ లో కనిపించనున్నాడు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. అయితే ఆ సినిమా మొదలు కాకముందే ఇటీవల మరో పాన్ ఇండియా మూవీ ప్రకటించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమా గురించి ప్రతి వార్త ఇంటర్నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అవుతోంది.

అయితే దాదాపు ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల పైనే ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆదిపురుష్ గురించి పలు విషయాలు షేర్ చేసుకున్నాడు. 'మొదటగా ఈ సినిమా ఆలోచన వచ్చినప్పుడే ప్రభాస్ హీరో అని ఫిక్స్ అయిపోయాను. ప్రభాస్ ఈ సినిమాను ఒప్పుకోకపోయి ఉంటే ఆదిపురుష్ అనే సినిమానే ఉండేది కాదు. అంతే ఆయన నో అంటే పక్కన ఆదిపురుష్ స్క్రిప్ట్ పక్కన పెట్టేవాడిని' అంటూ చెప్పిన మాటలు ప్రభాస్ పై తనకున్న విసన్, నమ్మకాన్ని తెలుపుతుందని ప్రభాస్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఓం రౌత్ మాటలు బట్టి చూస్తే డార్లింగ్ కి మరో హిట్టు కన్ఫర్మ్ అనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీలో టాక్. ఇదేకాక ప్రభాస్.. నాగ్ అశ్విన్ తో సైంటిఫిక్ థ్రిల్లర్ చేయనున్నాడు. అందులో ప్రభాస్ సరసన దీపిక పదుకొనె రొమాన్స్ చేయనుంది.