Begin typing your search above and press return to search.

'నేను పర్ఫెక్ట్ కాదు.. నేనొక యోధురాలిని'.. సమంత ఇన్స్టా సందేశం..!

By:  Tupaki Desk   |   2 Nov 2021 8:04 AM GMT
నేను పర్ఫెక్ట్ కాదు.. నేనొక యోధురాలిని.. సమంత ఇన్స్టా సందేశం..!
X
అగ్ర కథానాయిక సమంత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రొఫెషనల్ లైఫ్ తో పాటుగా తన వ్యక్తి గత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా సామ్ ఈ వేదికగా ద్వారానే వెల్లడిస్తూ ఉంటారు. ఇటీవల తన భర్త అక్కినేని నాగ చైతన్య తో విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుండి 'మై మమ్మా సెడ్' (మా అమ్మ చెప్పింది) అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ లో పలు సందేశాలను షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా మరో స్ఫూర్తిదాయకమైన ఆలోచనను పంచుకుంది సామ్.

''నేను బలంగా ఉన్నాను.. నేను స్థితిస్థాపకంగా ఉన్నాను.. నేను పర్ఫెక్ట్ కాదు.. నేను పర్ఫెక్ట్.. నేను ఎప్పుడూ వదులుకోను.. నేను ప్రేమిస్తున్నాను.. నేను నిశ్చయించుకున్నాను.. నేను క్రూరురాలిని.. నేను మనిషిని.. నేను ఒక యోధురాలిని" అంటూ సమంత ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్‌ చేసింది. ఈ స్ఫూర్తిదాయకమైన సందేశానికి #MyMommaSaid అనే హ్యాష్‌ ట్యాగ్‌ ని క్యాప్షన్ గా పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇటీవల సమంత పెళ్లి గురించి ఓ ఆసక్తికర సందేశాన్ని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తల్లిదండ్రులు ఆడపిల్లలను ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా పెంచాలంటూ భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ చేసిన పోస్ట్ ని సామ్ పంచుకుంది. ''మీ కూతురుని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అని ఆలోచించకుండా ఆమెను శక్తివంతంగా తీర్చిదిద్దండి. కుమార్తె పెళ్లి కోసం డబ్బు దాచిపెట్టడానికి బదులు ఆమె చదువుపై ఖర్చుపెట్టండి. ముఖ్యంగా పెళ్లికి ఆమెను సన్నద్ధం చేయడానికి బదులు.. తన కాళ్లపై తాను నిలబడగలిగేలా చేయండి. తనని తాను ప్రేమించుకోవడం.. ఆత్మస్థైర్యంతో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే భయపడకుండా నిలబడగలిగేలా జీవించడం నేర్పించండి'' అని ఇందులో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే సమంత తన భర్త తో విడిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత.. వీలైనంత త్వరగా మానసికంగా దృఢంగా మారాలని ఆమె నిశ్చయించుకుంది. దీని కోసం తీర్థయాత్రలు - విహారయాత్రలను మార్గంగా ఎంచుకుంది. ఇటీవలే తన స్నేహితురాలు శిల్పా రెడ్డి తో కలిసి చార్ ధామ్ ఆధ్యాత్మిక యాత్రను ముగించుకు వచ్చింది. ఇందులో భాగంగా గంగోత్రి - యమునోత్రి - బద్రీనాథ్ - కేదార్‌ నాథ్‌ లను సందర్శించిన సమంత.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఇదే క్రమంలో తన మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ - స్టైలిస్ట్ జుకల్కర్ ప్రీతమ్ తో కలిసి దుబాయ్ కు వెళ్ళొచ్చింది. హైదరాబాద్ కు వచ్చిన సామ్.. మళ్ళీ ఫిజికల్ వర్కవుట్స్ మీద ఫోకస్ పెట్టింది. అలానే ఇంట్లో తన పెట్ డాగ్స్ తో కలిసి సంతోషకరమైన క్షణాలను గడుపుతోంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పాన్ ఇండియా సినిమా పూర్తి చేసింది. అలానే విగ్నేష్ శివన్ తో 'కాతువాకుల రెండు కాదల్' అనే తమిళ సినిమా చేస్తోంది. విడాకుల ప్రకటన తర్వాత సమంత రెండు బైలింగ్వల్ ప్రాజెక్ట్స్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో త్వరలో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.