Begin typing your search above and press return to search.

ఇలాంటి మహేశ్ బాబును ఇంతకుముందెప్పుడూ చూడలేదు!

By:  Tupaki Desk   |   7 May 2022 5:34 PM GMT
ఇలాంటి మహేశ్ బాబును ఇంతకుముందెప్పుడూ చూడలేదు!
X
మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా నటించిన 'సర్కారువారి పాట' సినిమా, ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ వేడుకకి ఈ సినిమా నటీనటులు .. సాంకేతిక నిపుణులతో పాటు సుకుమార్ .. వంశీ పైడిపల్లి .. గోపీచంద్ మలినేని .. బుచ్చిబాబు .. సుధీర్ బాబు వచ్చారు. సుకుమార్ - మహేశ్ బాబు కాంబినేషన్లో గతంలో '1 నేనొక్కడినే' సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య  మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ స్టేజ్ పై సుకుమార్ మాట్లాడాడు.

"ఇంతకుముందే ఇక్కడ 'మ మ మహేశా'సాంగ్ లో మహేశ్ బాబును చూశాను. ఇలాంటి ఒక మహేశ్ బాబును నేను ఈ 20 ఏళ్లలో చూడలేదు. ఇప్పటి నుంచి ఇక ఇలాగే చూడాలని అనుకుంటున్నాను.

పరశురామ్ ఆయనను చాలా బాగా చూపించాడు. ఈ సాంగ్ థియేటర్లో దద్దరిల్లిపోతుంది. ఈ సినిమా ట్రైలర్ చూసిన దగ్గర నుంచి నేను కూడా ఈ సినిమాను  ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎదురుచూస్తున్నాను. ఇలాంటి ఒక సినిమాను నిర్మించినందుకు ముందుగా నిర్మాతలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఇక పరాశురామ్ నాకు చాలా కాలంగా తెలుసు. తన డైలాగ్స్ నాకు చాలా ఇష్టం. ఇప్పుడు డైలాగ్స్ బాగా రాసే చాలా తక్కువ మందిలో పరశురామ్ ఒకడు. ఒక సీన్ ను ఆయన ఎంత సెన్సిటివ్ గా చెప్పగలడు అనే దానికి నిదర్శనంగా మన కి 'గీత గోవిందం' సినిమా కనిపిస్తుంది.

అలాంటి ఒక  డైరెక్టర్ మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూస్తారు. ఇక మహేశ్ బాబుగారి విషయానికి వస్తే, '1 నేనొక్కడినే' సినిమా చేసినప్పుడు ఆయన ఎంతో సపోర్ట్ ఇచ్చారు. సెట్లో  ఒక డైరెక్టర్ కి ఆయన ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తారు.

ఏ డైరెక్టర్ దగ్గరికైనా ఆయన ఒక చిన్నపిల్లాడిలా వచ్చి, మళ్లీ ఇంకో టేక్ చేద్దామా అని అడుగుతారు. నిజంగా అప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తుంది. ఆయనతో కలిసి పని చేసిన రోజులను నేను ఎప్పటికీ మరిచిపోలేను. అంతమంచి ఛాన్స్ ఇచ్చినందుకు నేను ఎప్పుడూ ఆయనను మరచిపోను. ఇంత జోవియల్  గా .. జోయ్ ఫుల్ గా ఆయనను తెరపై చూడటం ఫస్టు టైమ్ .. చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.