Begin typing your search above and press return to search.

షారుఖ్ సతీమణితో నమ్రత ఊహించని లంచ్ భేటీ..!

By:  Tupaki Desk   |   15 April 2022 1:30 PM GMT
షారుఖ్ సతీమణితో నమ్రత ఊహించని లంచ్ భేటీ..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా.. బాలీవుడ్ ప్రముఖులతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తో నమ్రత లంచ్ భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి అందమైన జ్ఞాపకాలను.. సంతోషకరమైన క్షణాలను పంచుకున్నారు. ఈ విషయాన్ని నమ్రత ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.

గౌరీ ఖాన్ తో కలిసి ఉన్న ఓ ఫోటోని నమ్రత షేర్ చేసింది. "అనుకోని ఫన్ లంచ్!! గౌరీఖాన్ హౌస్ లో ఉన్నాను. చాలా సంవత్సరాల తర్వాత ఇలా కలిసాం. లంచ్ పూర్తైన తర్వాత ఫ్లాష్ బ్యాక్ లు.. గొప్ప జ్ఞాపకాలు మరియు చాలా నవ్వులు మిగిల్చాయి. గౌరీ మీరు ఎప్పటిలాగే మెరుస్తూ ఉండండి" అని రాసుకొచ్చింది.

ఇందులో స్టార్ వైవ్స్ ఇద్దరూ బ్లాక్ అండ్ వైట్ దుస్తులలో నేచురల్ బ్యూటీతో మెరిసిపోతున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో అడుగుపెట్టిన నమ్రత శిరోద్కర్.. ఇప్పటికీ అక్కడి సినీ ప్రముఖులతో స్నేహం చేస్తోంది. ఇక షారుఖ్ మరియు మహేష్ బాబు కుటుంబాలకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. గతంలో 'బ్రహ్మోత్సవం' సెట్స్ లో మహేష్ దంపతులతో షారుక్ మీట్ అయిన సంగతి తెలిసిందే.

ఇకపోతే నమ్రత శిరోద్కర్ తన భర్త బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ అతనికి సపోర్ట్ గా ఉంటూ వస్తోంది. మహేష్ ఏఎంబీ సినిమాలో భాగస్వామి అవడానికి.. హుంబుల్ టెక్స్ టైల్ బిజినెస్ లు స్టార్ట్ చేయడానికి నమ్రతే కారణమని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటారు. అలానే హోమ్ ప్రొడక్షన్ GMB ఎంటర్టైన్మెంట్స్ లో రూపొందే సినిమాల నిర్మాణాలలోను నమ్రత కీలకంగా వ్యవహరిస్తోంది.

ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్లతో కలిసి నిర్మిస్తున్నారు. ఒక పాట మినహా సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ చిత్రాన్ని మే 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ''మేజర్'' నిర్మాణంలో జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో భాగస్వామిగా ఉంది. 26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు - హిందీ - మలయాళ భాషల్లో 2022 మే 27న ఈ చిత్రం విడుదల కానుంది.