Begin typing your search above and press return to search.

కరోనాపై కదిలివచ్చిన తమిళ హీరోలు

By:  Tupaki Desk   |   14 May 2021 5:30 PM GMT
కరోనాపై కదిలివచ్చిన తమిళ హీరోలు
X
కరోనా కల్లోలంతో అట్టుడుకుతున్న తమిళనాడు ప్రజలను ఆదుకునేందుకు అక్కడి అగ్రహీరోలు, సినీ ప్రముఖులు ముందుకొచ్చారు. భారీగా విరాళాలు అందజేశారు. అందరికంటే ఎక్కువగా కోలీవుడ్ సినీ తారలు కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం కొత్తగా ఏర్పడ్డ స్టాలిన్ ప్రభుత్వానికి భారీ సాయాలు చేశారు.

కొత్త సీఎం స్టాలిన్ చేస్తున్న పనితీరుపై సినీ తారలు వారి మద్దతు అందిస్తూ కోవిడ్ బాధితుల కోసం భారీగా విరాళాలు అందిస్తున్నారు. అందరికంటే ముందుగా హీరో సూర్య, కార్తి కుటుంబం తరుఫున కోటి రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. కుటుంబ సమేతంగా సూర్య సీఎం స్టాలిన్ కు కోటి రూపాయల చెక్ ను అందించారు.

ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం తన వంతుగా కోటి రూపయాలను కోవిడ్ రిలీఫ్ ఫండ్ కోసం సీఎం స్టాలిన్ ను కలిసి అందజేశారు. రాష్ట్ర పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. రజినీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ ఫ్యామిలీ కూడా రూ.కోటి రూపాయలను విరాళంగా ముఖ్యమంత్రికి అందజేశారు.

ఇక మరో స్టార్ హీరో అజిత్ కూడా తన వంతుగా కోవిడ్ బాధితుల కోసం రూ.25 లక్షల రూపాయల చెక్ ను సీఎం స్టాలిన్ కు అందజేశారు. ఇక మరో దర్శకుడు మురగదాస్ కూడా 25 లక్షల చెక్కును స్టాలిన్ కు ఇచ్చారు. ఉదయనిధి స్టాలిన్ సైతం రూ.25 లక్షల రూపాయలు అందించారు.