Begin typing your search above and press return to search.

బాలీవుడ్ జంటను కలిపిన కరోనా

By:  Tupaki Desk   |   26 March 2020 3:30 AM GMT
బాలీవుడ్ జంటను కలిపిన కరోనా
X
హృతిక్ రోషన్ సుసానే ఖాన్‌ దంపతులు వారి దాంపత్య జీవితానికి అర్ధాంతరంగా ముగింపు పలికిన విషయం తెలిసిందే. 2013లో ఈ జంట విడాకులు తీసుకోవడం బాలీవుడ్‌ లో సంచలనం రేపింది. వారికి హ్రేహాన్ - హృదాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వైవాహిక జీవితపరంగా కలిసి ఉండకపోయినా వీరిద్దరు తమ పిల్లల కోసం స్నేహితుల్లా మాత్రం సందర్భోచితంగా కలుసుకొంటున్నారు. కరోనా వైరస్ కారణంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు చేస్తుంటే.. బాలీవుడ్ జంట మాత్రం ఒకరికొకరు మానసికంగా దగ్గరయ్యారు. గత కొద్దికాలంగా విడాకులు తీసుకొని ఉంటున్న హృతిక్ - సుసానే ఖాన్ మాత్రం ఇప్పుడు కరోనా కారణంగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ విషయం బాలీవుడ్‌ లోనూ - అభిమానుల్లోనూ చర్చనీయాంశమైంది.

దేశవ్యాప్తంగా కరోనా భయాలు నెలకొన్నడంతో సుసానే ఖాన్‌ తన కుమారులకు ఎలాంటి ఆపద కలగకుండా జాగ్రత్త తీసుకోవాలనుకొన్నది. వెంటనే హృతిక్ ఇంట్లో ఉన్న హ్రేహాన్ - హృదాన్‌ కు తోడుగా నిలిచింది. తన పిల్లల బాగోగుల కోసం సుసానే ఖాన్ నా ఇంటికి వచ్చింది. కొద్దిరోజులుగా సుసానే మా ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకొంటున్నది. తన కుమారుల పట్ల ప్రేమకు నిదర్శనంగా నిలిచింది అంటూ హృతిక్ రోషన్ తన ఇన్స్‌టాగ్రామ్‌ లో ఫోటోను పోస్టు చేశారు. ఇధి డియర్ సుసానే ఫోటో ఇది. పిల్లల సంరక్షణ కోసం తాత్కాలికంగా తన ఇంటి నుంచి మా ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులగా మన బాధ్యతలను గుర్తు చేస్తూ నీవు తీసుకొన్న నిర్ణయానికి థ్యాంక్స్ అంటూ హృతిక్ ఓ పోస్టు పెట్టారు. విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్న ఈ జంటను కరోనా కలిపిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.