Begin typing your search above and press return to search.

శివబాలాజీ ఫిర్యాదుపై హెచ్​ఆర్​సీ స్పందన.. ఇక ఆ స్కూల్​కు చిత్తడే!

By:  Tupaki Desk   |   16 Sep 2020 5:33 PM GMT
శివబాలాజీ ఫిర్యాదుపై హెచ్​ఆర్​సీ స్పందన.. ఇక ఆ స్కూల్​కు చిత్తడే!
X
భారీగా ఫీజులు వసూలు చేస్తూ.. విద్యార్థులను, తల్లిదండ్రులను మణికొండలోని మౌంట్​ లిటేరా జీ స్కూల్​ వేధిస్తున్నదని ప్రముఖ నటుడు, బిగ్​బాస్​ విన్నర్​ శివబాలాజీ హెచ్​ఆర్​సీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా శివబాలాజీ ఫిర్యాదుపై హెచ్​ఆర్​సీ స్పందించింది. ‘సదరు పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోండి.. ఈ విషయంపై మాకు వారంలోగా పూర్తిస్థాయి నివేదిక కావాలి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తుంటే ఇంతకాలం ఎందుకు చూస్తూ ఊరుకున్నారు. ’ అంటూ హెచ్​ఆర్సీ రంగారెడ్డి డీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేసింది.వెంటనే ఈ అంశంపై విచారణ జరపాలని ఆదేశించింది.

ఈ సందర్భంగా శివబాలాజీ మీడియాతో మాట్లాడుతూ.. మౌంట్​ లిటేరా జీ స్కూల్​ ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నదని మండిపడ్డారు. ఇదేంటని అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. పిల్లలకు ఆన్​లైన్​ క్లాసులు చెప్పకుండా ఐడీ బ్లాక్​ చేస్తున్నారని మండిపడ్డారు. కాగా ఈ విషయంపై ఇంకా స్కూల్​ యాజమాన్యం స్పందించలేదు. ఒక్క మౌంట్​ లిటేరా జీ స్కూలే కాదు హైదరాబాద్​లోని చాలా కార్పొరేట్​ పాఠశాలలు ఇదే తరహాలో భారీ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఆన్​లైన్​ క్లాసుల పేరుతో నిలువు దోపిడీకి యత్నిస్తున్నాయి. ఈ ఘటనలపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కార్పొరేట్​ స్కళ్ల దందాను నిలువరించాలని ప్రజాసంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్​ చేస్తున్నారు.