Begin typing your search above and press return to search.

విరాట్‌ కోహ్లీ, తమన్నాకు హైకోర్టు నోటీసులు .. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   27 Jan 2021 10:36 AM GMT
విరాట్‌ కోహ్లీ, తమన్నాకు హైకోర్టు నోటీసులు .. ఎందుకంటే ?
X
టీం ఇండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ , మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాకి కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ గేమ్స్‌ వివాదంలో ‌కోహ్లీ, తమన్నా, మాలయాళ నటుడు అజు వర్గీస్ ‌కు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. త్రిసూర్‌ కు చెందిన పోలీ వర్గీస్‌ ఈ ఆన్‌ లైన్‌ రమ్మీ గేమ్స్‌ ను రద్దు చేయాలని కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించారు. ఆన్ ‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ వెబ్‌ సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ, వీటిని రద్దుచేయాలని కోరుతూ కోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

దీనిపై సెలబ్రటీలు సమాధానం చెప్పాల్సిందిగా.. కోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. అలాగే దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కాగా, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లపై మద్రాస్ హైకోర్టు గతేడాది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వీటిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని సెలబ్రిటీలపై, ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా వీటిపై కేరళ హైకోర్టు కూడా సీరియస్‌ గా స్పందించింది. ఆన్‌ లైన్‌ బెట్టింగ్స్‌ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసింది.