Begin typing your search above and press return to search.

# ప్ర‌భాస్ 21 .. కత్రిన కాదు ఆలియాపై క‌న్నేశారు!

By:  Tupaki Desk   |   12 March 2020 4:30 AM GMT
# ప్ర‌భాస్ 21 .. కత్రిన కాదు ఆలియాపై క‌న్నేశారు!
X
ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన‌ బాహుబ‌లి రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కు ఏ రేంజులో క్రేజ్ పెంచిందో తెలిసిందే. అటు బాలీవుడ్ స‌హా విదేశాల్లోనూ ప్ర‌భాస్ కు విప‌రీత‌మైన‌ ఫాలోయింగ్ పెరిగింది. సాహో నిరాశ‌ప‌రిచినా ప్ర‌భాస్ కు పాన్ ఇండియా ఫ్యాన్ బేస్ చెక్కు చెద‌ర‌కుండా ఉంది.అందుకే డార్లింగ్ ప్ర‌స్తుత సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మ‌హాన‌టి చిత్రాన్ని అందంగా మ‌లిచిన నూత‌న ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తో సినిమా చేసేందుకు ప్ర‌భాస్ ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఈ సినిమాలో క‌థానాయిక‌ల ఎంపిక‌పైనా దృష్టి సారించార‌ని తెలిసింది.

తాజాగా బాలీవుడ్ హాటీల్లో క‌త్రినా కైఫ్ ని ఎంపిక చేసేందుకు చిత్ర‌బృందం సిద్ధంగా ఉంద‌ని చెబుతున్నా.. ఇప్పుడు మ‌రో కొత్త పేరు వినిపిస్తోంది. క‌త్రిన నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ గ్రీన్ సిగ్న‌ల్ అన్న‌దే లేద‌ట‌. దీంతో ఆల్ట‌ర్నేట్ ఆప్ష‌న్స్ గా ప‌లువురు కుర్ర‌భామ‌ల పేర్ల‌ను ప‌రిశీలిస్తే ఆ జాబితాలో ఆలియా పేరును సీక్రెట్ గా ఉంచార‌ని తెలిసింది.

సైన్స్ ఫిక్ష‌న్ బ్యాక్ డ్రాప్ తో సుమారు రూ.400 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించేందుకు అశ్వ‌నిద‌త్ - నాగ్ అశ్విన్ బృందం చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఆ క్ర‌మంలోనే పాన్ ఇండియా అప్పీల్ కోసం బాలీవుడ్ నాయిక‌ల్లో క‌త్రిన లేదా ఆలియాని ఎంపిక చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇక ఆలియా క్రేజు ఆర్.ఆర్.ఆర్ రిలీజైతే ప‌దింత‌ల‌వుతుంది. అది కూడా త‌మ సినిమా హిందీ మార్కెట్ కి ప్ల‌స్ అయ్యే ఆస్కారం ఉంది కాబ‌ట్టి త‌న పేరును ప‌రిశీలించార‌ని చెబుతున్నారు. ఇక‌పోతే ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ మూవీకి ఆలియాని ఓకే చేయించే ప‌ని లో ఉన్నార‌ని ప్ర‌చారమ‌వుతోంది. మ‌రి ఈ వార్త‌ల్లో నిజం ఎంత‌? అన్న‌ది చూడాలి.

ఇక‌పోతే ఆలియా తొంద‌ర్లోనే ర‌ణ‌బీర్ క‌పూర్ ని పెళ్లాడి లైఫ్ లో సెటిల‌వ్వాల‌నుకుంటోంద‌ని ఓ ప్ర‌చారం ఉండ‌నే ఉంది. మ‌రి ఇలాంటి టైమ్ లో తెలుగులో వ‌రుస క‌మిట్ మెంట్ల‌కు ఆలియా సిద్ధ‌మేనా? అన్న‌ది ఓ స‌స్పెన్స్. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ యూర‌ప్ లో జాన్ షూటింగ్ లో బిజీబిజీగా గ‌డిపేస్తున్నారు. రాధాకృష్ణ‌ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో యూవీ క్రియేష‌న్స్‌- గోపీకృష్ణ మూవీస్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజాహెగ్డే క‌థానాయిక‌. ఇది పూర్తి పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీ. ఈసారి త‌ప్ప‌నిస‌రిగా విజ‌యం సాధించాల‌నే క‌సితో ప్ర‌భాస్ ఉన్నార‌ని సినీ వ‌ర్గాల టాక్‌. ఈ మూవీ వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో అభిమానుల ముందుకు రానుంది.

అయితే నాగ్ అశ్విన్ తో పాన్ ఇండియా మూవీకి క‌త్రినా కైఫ్ ను ఎంపిక చేయాల‌న్న ఆలోచ‌న‌పైనా అభిమానుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. ఈ పొడుగు కాళ్ల సుంద‌రి ప్ర‌భాస్ కి స‌రైన జోడీగా ఉంటుంద‌ని ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాల్లో సంబ‌ర ప‌డుతున్నారు. ఈలోగానే ఆలియా పేరు బ‌య‌ట‌కు రావ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ ప్ర‌చారంపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.