Begin typing your search above and press return to search.

షాక్‌: నితిన్ అవ‌య‌వ‌దానం!

By:  Tupaki Desk   |   26 April 2019 5:16 AM GMT
షాక్‌: నితిన్ అవ‌య‌వ‌దానం!
X
కెరీర్ ప‌రంగా తాడో పేడో తేల్చుకునే ప‌నిలో ఉన్నాడు యంగ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్. వ‌రుస‌గా న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలిస్తూ ప్ర‌యోగాలు చేసేందుకు ఏమాత్రం వెన‌కాడ‌డం లేదు. వేగేష్న స‌తీష్ ద‌ర్శ‌క‌త్వంలోని `శ్రీ‌నివాస క‌ళ్యాణం`.. హ‌ను రాఘ‌వ‌పూడి `లై` చిత్రాలు ఫ్లాపైనా.. అవేవీ నితిన్ ప్ర‌ణాళిక‌లకు అడ్డు క‌ట్ట వేయ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ముగ్గురు న‌లుగురు డైరెక్ట‌ర్లు అత‌డి క్యూలో ఉన్నారు. అందులో యువ‌ద‌ర్శ‌కులే ఎక్కువ‌. మొన్న త‌న‌ బ‌ర్త్ డే రోజున వెంకీ కుడుముల‌తో `భీష్మ- సింగిల్ ఫ‌ర్ ఎవ్వ‌ర్` చిత్రం గురించి.. కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోయే సినిమా గురించి అధికారికంగా వివ‌రాల్ని అందించాడు నితిన్. వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలోని భీష్మ ప‌క్కా హిలేరియ‌స్ క‌మ‌ర్షియ‌ల్ బొమ్మ!! అంటూ ట్విట్ట‌ర్ లో వివ‌రాలు అందించారు. ఈ చిత్రంలో ర‌ష్మిక క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై `జెర్సీ` ఫేం సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అలాగే మ‌రో ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలోని సినిమా 2019 చివ‌రిలో ప్రారంభించి 2020లో రిలీజ్ చేస్తామ‌ని నితిన్ ప్ర‌క‌టించారు. సొంత బ్యాన‌ర్ శ్రేష్ఠ్ మూవీస్ లో నిఖితా రెడ్డి- సుధాక‌ర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. ``నా కెరీర్ లోనే యాంబిషియ‌స్ ఛాలెంజింగ్ మూవీ ఇది.. సూప‌ర్ కిక్ తో ఉన్నా`` అంటూ నితిన్ ఆనందం వ్య‌క్తం చేశాడు. నితిన్ కెరీర్ లోనే మ‌రో ఛాలెంజింగ్ స్టోరీని ఎంచుకున్నాడ‌ని అత‌డి మాట‌ల్ని బ‌ట్టి అర్థ‌మైంది. ఒక క‌మ‌ర్షియ‌ల్ బొమ్మ‌.. ఇంకో ఛాలెంజింగ్ బొమ్మ ప్లాన్ చేశాడ‌న్న‌మాట‌!!

ఇక ఇదే హుషారులో వేరొక సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు చంద్ర శేఖ‌ర్ ఏలేటి కి నితిన్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మేలో ఈ సినిమా ప్రారంభోత్స‌వానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. తాజాగా ఆ సినిమా కాన్సెప్ట్ లీకైంది. అవ‌య‌వ‌దానం నేప‌థ్యంలో ఆస‌క్తి రేకెత్తించే సినిమా ఇది. అవ‌య‌వ‌దానం చేసే స‌న్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయ‌ని.. కంట‌త‌డి పెట్టించే ఎమోష‌న్ ఉంటుంద‌ని చెబుతున్నారు. చ‌క్క‌ని సామాజిక సందేశం ఉండేలా ద‌ర్శ‌కుడు క‌థాంశాన్ని తీర్చిదిద్దార‌ట‌. మ‌రోవైపు `గుండెజారి గ‌ల్లంత‌య్యిందే` ఫేం విజ‌య్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలోనూ నితిన్ సినిమా ఉంటుంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. విజ‌య్ కొండా ఇప్ప‌టికే నితిన్ కి స్టోరీ లైన్ వినిపించి స్క్రిప్టును రూపొందించే ప‌నిలో ఉన్నాడ‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. ఇక ప్ర‌స్తుత స‌న్నివేశం చూస్తుంటే .. క‌థాంశాల విష‌యంలో హీరోల సెల‌క్ష‌న్ మారింది. నాని, నాగ‌చైత‌న్య లాంటి హీరోలు ప్ర‌యోగాత్మ‌క క‌థల్లో న‌టిస్తున్నారు. నితిన్ తొలినుంచి ఆ బాట‌లోనే ఉన్నా.. తాజాగా ఎంచుకునే క‌థ‌లో ఎమోష‌న్.. సోష‌ల్ కాజ్.. వినోదం ఏమాత్రం మిస్ కాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది.