Begin typing your search above and press return to search.

నిఖిల్ సిద్ధార్థ్ మ్యారేజ్ ఫిక్స్ అయిందోచ్

By:  Tupaki Desk   |   2 Feb 2020 12:32 PM GMT
నిఖిల్ సిద్ధార్థ్ మ్యారేజ్ ఫిక్స్ అయిందోచ్
X
విభిన్నమైన కథలు ఎంచుకుని ప్రేక్షకులను మెప్పిస్తూ తన కెరీర్ లో ముందుకు సాగుతున్న యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ఈమధ్యే 'అర్జున్ సురవరం' సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం నమోదు చేశాడు. నిఖిల్ వ్యక్తిగత జీవితంలో కూడా ఈ ఏడాది పెద్ద మార్పు రాబోతోంది. త్వరలో నిఖిల్ తన బ్యాచిలర్ స్టేటస్ కు పర్మనెంట్ గా బైబై చెప్పి ఒక ఇంటివాడు కాబోతున్నాడు.

డా. పల్లవి వర్మ అనే అమ్మాయితో నిఖిల్ వివాహం ఏప్రిల్ 16 న జరగనుంది. ఈ విషయం నిర్మాత ఎస్కేయన్ ట్వీట్ చేయగా.. నిఖిల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రీ ట్వీట్ చేశాడు. "అర్జున్ సురవరం సూపర్ సక్సెస్ తర్వాత నిఖిల్- డా. పల్లవి వర్మ ఎంగేజ్ మెంట్ అయింది. ప్రపోజ్ చేశారు.. పెద్దల నుంచి నుంచి అనుమతి తీసుకున్నారు. ఏప్రిల్ 16 న ఇద్దరికీ వివాహం జరగనుంది. కంగ్రాచులేషన్స్ బ్రదర్" అంటూ మూడు ఫోటోలు పోస్ట్ చేశారు ఎస్కేయన్. ఒక సూపర్ లొకేషన్ లో నిఖిల్ మోకాలి మీద కూర్చుని.. పల్లవికి ప్రపోజ్ చేస్తున్నాడు. మరో ఫోటోలో ఇద్దరూ కలిసి ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్టుగా వెనక్కు తిరిగి ఉన్నారు. వారి వెనక షాంపేన్ బాటిల్ ఉంది. ఇక మూడవ ఫోటోలో ఇద్దరి చేతి వేళ్ళకు రింగ్స్ ఉన్నాయి.ఈ విషయం వెల్లడించిన వెంటనే నిఖిల్ ను అభినందిస్తూ.. బెస్ట్ విషెస్ మెసేజులు వెల్లువెత్తాయి.

నిఖిల్ సినిమాల విషయానికి వస్తే చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ' సీక్వెల్ 'కార్తికేయ 2' లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా అదృష్టం పరిక్షించుకుంటున్నాడని సమాచారం.