Begin typing your search above and press return to search.

నవ దంపతుల వెంకన్న దర్శణం

By:  Tupaki Desk   |   26 Nov 2021 10:24 AM GMT
నవ దంపతుల వెంకన్న దర్శణం
X
ఆర్ ఎక్స్ 100 సినిమా తో హీరోగా పరిచయం అయిన కార్తికే టాలీవుడ్ లో వరుస సినిమాలతో మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ప్రస్తుతం తమిళ సినిమా వాలిమై తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. హీరోగానే కాకుండా విలన్ గా కూడా నటిస్తూ ప్రేక్షకుల అభిమానంను దక్కించుకుంటున్న కార్తికేయ తాజాగా ఒక ఇంటి వాడయ్యాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టాడు. తాను ఎంతో అభిమానించే.. ఇష్టపడే మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా కార్తికేయ పెళ్లి జరింది. చిరంజీవి రావడంతో కార్తికేయ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

పెళ్లి తర్వాత భారీ ఎత్తున రిసెప్షన్ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. పెళ్లి తంతు అంతా ముగిసింది. దాంతో కార్తికేయ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు కొందరు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్‌ ప్రారంభం సమయంలో దర్శణంను కల్పించారు. శ్రీవారి దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు కార్తికేయ దంపతులను స్వామి వారి తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. స్వామి వారి దర్శణం తర్వాత కార్తికేయ దంపతులు మరియు కుటుంబ సభ్యులు వెనుదిరిగారు.

ఇక కార్తికేయ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే రాజా విక్రమార్క సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా మిశ్రమ స్పందిన దక్కించుకుంది. ఇప్పుడు కార్తికేయ దృష్టి పూర్తిగా అజిత్ హీరోగా నటించిన వాలిమై సినిమాపై ఉంది. వాలిమై సినిమా విడుదలైన తర్వాత కొత్త సినిమాలకు కమిట్ అవ్వాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హీరోగా మరియు విలన్ గా కెరీర్ లో ముందుకు వెళ్తున్న హీరోలు అతి కొద్ది మందే ఉన్నారు. వారిలో కార్తికేయ ఒకడు అనడంలో సందేహం లేదు.