Begin typing your search above and press return to search.

400 మందికి హీరో దీపావళి బంగారు గిఫ్ట్‌

By:  Tupaki Desk   |   8 Nov 2020 1:02 PM GMT
400 మందికి హీరో దీపావళి బంగారు గిఫ్ట్‌
X
హీరోయిన్‌ సావిత్రి గారు తన సినిమా షూటింగ్‌ పూర్తి అయిన సమయంలో ఆ సినిమాకు పని చేసిన యూనిట్‌ సభ్యులకు మరియు తన వ్యక్తిగత సిబ్బందికి బహుమానాలు ఇచ్చేవారట. కనీసం కొత్త బట్టలు అయినా ఇచ్చేవారు అంటూ ఆమెతో వర్క్‌ చేసిన చాలా మంది చెబుతూ ఉంటారు. ఆ పద్దతి తమిళ సినిమా పరిశ్రమలో ఇప్పటికి కూడా కొందరు కంటిన్యూ చేస్తున్నారు. తమిళంకు చెందిన పలువురు స్టార్స్‌ తమ సినిమాలు షూటింగ్‌ పూర్తి అయిన సమయంలో కాస్ట్‌ అండ్‌ క్రూ మొత్తానికి కూడా ఏదో ఒక విధంగా బహుమానాలు అందించేవారు. ఇప్పుడు తమిళ హీరో శింబు కూడా ఈ ఆనవాయితీని ప్రారంభించాడు.

శింబు ప్రస్తుతం ఈశ్వరన్‌ సినిమాలో నటిస్తున్నాడు. లాక్‌ డౌన్ కారణంగా ఆలస్యం అయిన ఈ సినిమా ఎట్టకేలకు పూర్తి అయ్యింది. ఈ సినిమా షూటింగ్‌ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శింబు గోల్డ్‌ కాయిన్‌ మరియు కొత్త బట్టలను అందించారు. దీపావళి కానుకగా ఇవి ఆయన వారికి అందించారు. ఒక్క గ్రామ్‌ గోల్డ్‌ కాయిన్‌ ను కానుకగా ఆయన ఇచ్చారు. ప్రస్తుతం రేటు ప్రకారం ఒక్క గ్రామ్‌ అయినా కూడా తక్కువ రేటు ఏమీ కాదు.

గోల్డ్‌ కాయిన్‌ మరియు డ్రస్‌ మొత్తం కలిపి ఖచ్చితంగా అయిదు వేల రూపాయల వరకు ఇచ్చి ఉంటాడు. మొత్తం 400 మందికి శింబు ఈ బహుమానం ఇచ్చాడు. ఆయన దాతృత్వంకు ఈశ్వరన్‌ యూనిట్‌ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఈశ్వరన్‌ సినిమాను తెలుగులో ఈశ్వరుడు అనే టైటిల్‌ తో విడుదల చేయబోతున్నారు. బ్యాడ్‌ బాయ్‌ ఇమేజ్‌ ఉన్న శింబు ఇలా దీపావళి కానుక ఇవ్వడంతో ఒక్కసారిగా ఆయన మంచితనం గురించి చర్చించుకుంటున్నారు.